ఏప్రిల్ 1 నుంచి కొత్త పన్ను చట్టం అమలు.. మారనున్న పన్నుల విధానం

భారత్‌లో కొత్త ఆదాయపు పన్ను చట్టం-2025ను తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ కొత్త చట్టం ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది. అయితే, ఈ మార్పు కారణంగా ప్రస్తుత పన్ను రిటర్నుల ఫైలింగ్‌పై చెల్లింపుదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు స్పష్టం చేశారు. ఈ ఏడాది ఫైలింగ్ ప్రక్రియ మొత్తం ప్రస్తుతం అమల్లో ఉన్న 1961 చట్టం ప్రకారమే కొనసాగుతుందని హామీ ఇచ్చారు. 2025 ఏప్రిల్ 1 నుంచి 2026 మార్చి 31 వరకు…

Read More

భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

గత కొంతకాలంగా కొండెక్కి కూర్చున్న బంగారం, వెండి ధరలు ఇవాళ ఊహించని రీతిలో కుప్పకూలాయి. అంతర్జాతీయ మార్కెట్లో చోటుచేసుకున్న అనూహ్య పరిణామాల ప్రభావం దేశీయ బులియన్ మార్కెట్‌పై స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ మార్కెట్‌లో ధరలు భారీగా తగ్గడంతో జ్యువెలరీ షాపుల వద్ద సందడి మొదలైంది. 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) నిన్నటితో పోలిస్తే ఏకంగా రూ. 5,950 తగ్గి, ప్రస్తుతం రూ. 1,40,020 వద్ద ట్రేడ్ అవుతోంది. 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు)…

Read More

కమలం పార్టీకి గుడ్‌బై చెప్పిన ‘నందితా’

గౌహతి: అసోం రాజకీయ సమీకరణలు శరవేగంగా మారుతున్నాయి. ఎన్నికల వేళ అసోం కమలానికి గట్టి దెబ్బ తగిలింది. హిమంత బిశ్వ శర్మ క్యాబినెట్‌లో కీలక మంత్రిగా ఉన్న నందితా గర్లోసా కమలం పార్టీకి గుడ్ బై చెప్పారు. రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. బీజేపీకి రాజీనామా చేసిన నందితా ఆదివారం కాంగ్రెస్‌లో చేరారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె హాఫ్లాంగ్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా బరిలోకి దిగనున్నట్లు సమాచారం. 2022 నుంచి హిమంత బిశ్వశర్మ ప్రభుత్వంలో విద్యుత్,…

Read More

‘సార్.. నా మటన్ ఉడకలేదు, కేసు పెట్టండి’

అనంతపురం జిల్లా తాడిపత్రిలో విచిత్ర కేసు నేరస్తులు, దొంగలు, భూ తగాదాలతో నిత్యం రద్దీగా ఉండే పోలీస్ స్టేషన్‌కు ఉగాది పండగ నాడు ఒక వింతకేసు వచ్చింది. తాడిపత్రికి చెందిన సోడాల హాజీ అనే వ్యక్తి, చేతిలో మటన్ కుక్కర్‌తో స్టేషన్ మెట్లు ఎక్కడం చూసి పోలీసులు ఒక్క క్షణం అవాక్కయ్యారు. ఉగాది పండుగ రోజున జరగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.అసలేం జరిగిందంటే… ఉగాది పండగ అని హాజీ స్థానిక దుకాణంలో మటన్ కొనుగోలు…

Read More

ఏపీలో నేటి నుంచి ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం

ఇంటర్మీడియట్ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియకు ఇంటర్ విద్యా మండలి సర్వం సిద్ధం చేసింది. ఈరోజు నుంచి స్పాట్ వాల్యుయేషన్ ప్రారంభమవుతుండగా, ఏప్రిల్ రెండో వారంలో ఫలితాలను వెల్లడించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు బోర్డు కార్యదర్శి రంజిత్ బాషా తెలిపారు. మార్చి 25తో పరీక్షలు పూర్తిగా ముగియనున్న నేపథ్యంలో, ఫలితాలను త్వరితగతిన ఇచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 25 జిల్లా కేంద్రాల్లో మూల్యాంకన కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు రంజిత్ బాషా వివరించారు. ఇప్పటికే ప్రధాన పరీక్షలు…

Read More

చిత్తూరుపై రైల్వేశాఖ చిన్నచూపు

ఆగని కీలక ఎక్స్ ప్రెస్ రైళ్లు*కాట్పాడి, తిరుపతికి వెళుతున్న ప్రయాణీకులు (విశాలాంధ్ర-చిత్తూరు) జిల్లా కేంద్రమైన చిత్తూరు రైల్వే స్టేషన్ ప్రస్తుతం అధికారుల నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా మారింది. ప్రతిరోజూ ఈ స్టేషన్ మీదుగా పదుల సంఖ్యలో ఎక్స్ ప్రెస్ రైళ్లు పరుగు తీస్తున్నా… అందులో సగం కంటే ఎక్కువ రైళ్లకు ఇక్కడ స్టాపింగ్ లేకపోవడం గమనార్హం. రూ.కోట్లు ఆదాయాన్ని రైల్వే శాఖకు అందిస్తున్నా… కనీసం రైళ్లు ఆపడం లేదంటే అధికారులకు ఈ ప్రాంతంపై ఎంతటి నిర్లక్ష్యం ఉందో అర్థమవుతోంది….

Read More

యుద్ధంతో ప్రపంచవ్యాప్తంగా సంక్షోభం

కార్పొరేట్ శక్తుల ప్రయోజనాల కోసమేగ్యాస్, ఆయిల్ ధరల పెంపుతో రవాణా రంగంపై ప్రభావంట్రంప్‌ను నిలదీయడంలో మోదీ మౌనంమోదీపై చంద్రబాబు ఒత్తిడి తేవాలి29న హైదరాబాద్‌లో “నో వార్” భారీ ప్రదర్శనతిరుమలకు అపకీర్తి తెచ్చే వారిని పదవిలో ఉంచుతారా?` సిపిఐ జాతీయ నాయకులు డాక్టర్ కె. నారాయణ విజయవాడ ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయిల్ చేపడుతున్న యుద్ధం దేశవ్యాప్తంగా మానవాళిని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని, ఈ యుద్ధం ద్వారా అమెరికాలోని కార్పొరేట్ సంస్థలకు లాభాలు చేకూరుతున్నాయని సిపిఐ జాతీయ నాయకులు డాక్టర్ కె….

Read More

అశ్రునయనాల మధ్య హనుమంతరాయ చౌదరి అంత్యక్రియలు

వేలాదిగా తరలివచ్చిన అభిమానులు విశాలాంధ్ర, కళ్యాణదుర్గం: తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి అంత్యక్రియలు ఆదివారం కళ్యాణదుర్గం మండలం ఎర్రంపల్లి గ్రామంలో అభిమానులు, పార్టీ కార్యకర్తల అశ్రునయనాల మధ్య నిర్వహించబడ్డాయి. వేలాది మంది అభిమానులు తరలివచ్చి పెద్దాయన్ను చివరిసారిగా చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి, స్థానిక నాయకులు, వైసీపీ, కాంగ్రెస్, సిపిఐ నేతలు అంత్యక్రియల్లో పాల్గొని నివాళులు అర్పించారు. మృతుడి కుటుంబ సభ్యులు భార్య లక్ష్మీదేవి, కుమారులు…

Read More

యుద్ధం వద్దు – శాంతి ముద్దు” నినాదంతో తిరుపతిలో మహా శాంతి ర్యాలీ

ప్రపంచ దేశాలకు తిరుపతి నుంచి బలమైన శాంతి సందేశం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, యుద్ధ వాతావరణం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ, “యుద్ధం వద్దు – శాంతి ముద్దు”, “యుద్ధం కాదు – శాంతి కావాలి” అనే నినాదాలతో ఈరోజు తిరుపతి నగరంలో విశాలమైన శాంతి ర్యాలీ ఘనంగా నిర్వహించబడింది.మరణిస్తున్న పసి కందులు, అమాయక ప్రజలు మరియు యుద్ధ వాతావరణం పట్ల మనస్సు కలత చెందిన రీచ్ గ్లోబల్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ రమేష్ నాథ్…

Read More

హనుమంతరాయ చౌదరి మరణం ప్రజలకు తీరని లోటు…సిపిఐ నేత డి.జగదీష్

హనుమంతరాయ చౌదరి భౌతిక కాయానికి నివాళులు అర్పించిన సిపిఐ నాయకులు విశాలాంధ్ర, కళ్యాణదుర్గం: ప్రజా సమస్యల పరిష్కారాన్ని తన జీవిత ధ్యేయంగా తీసుకుని జీవితాంతం ప్రజాపక్షపాతిగా సేవలందించిన మాజీ ఎమ్మెల్యే, టిడిపి సీనియర్ నాయకుడు ఉన్నం హనుమంతరాయ చౌదరి అజాతశత్రువుగా నిలిచారని, ఆయన మరణం టిడిపి పార్టీకి మాత్రమే కాకుండా కళ్యాణదుర్గం ప్రజలకు తీరని లోటు అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు దేవరగుడి జగదీష్ పేర్కొన్నారు.ఆదివారం ఎర్రంపల్లిలోని హనుమంతరాయ చౌదరి స్వగృహంలో ఆయన భౌతిక కాయానికి…

Read More