అర్హులైన పేదలకు స్థలం ఇవ్వాలి – Visalaandhra

సిపిఐ పట్టణ కార్యదర్శి పూలశెట్టి రవికుమార్విశాలాంధ్ర -ధర్మవరం: ధర్మవరం పట్టణంలో అర్హులైన పేదలకు రెండు సెంట్లు అదేవిధంగా గ్రామీణ ప్రాంతాలలో కూడా మూడు సెంట్ల ఇంటి స్థలమును ఇవ్వాలని సిపిఐ పట్టణ కార్యదర్శి పూలశెట్టి రవికుమార్ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర పిలుపులో భాగంగా ధర్మవరం పట్టణం రూరల్ ప్రాంతాల్లో అర్హులైన ఇల్లు లేని నిరుపేదలకు పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు స్థలం ఇవ్వాలని…

Read More

చెరువు కట్ట అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయండి

టిడిపి మండల ఇన్చార్జి ధర్మవరపు మురళి విశాలాంధ్ర-రాప్తాడు (అనంతపురం జిల్లా) : మండల కేంద్రం సమీపంలోని రాప్తాడు చెరువు అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని టిడిపి మండల ఇన్చార్జి ధర్మవరపు మురళీ అధికారులకు సూచించారు.బుధవారం ఆయన చెరువు వద్ద జరుగుతున్న పనులను ఎమ్మెల్యే పరిటాల సునీత ఆదేశాలతో ఏపీఓ సావిత్రి, ఈసీ మురళి, సోమర నారాయణస్వామి, ఫీల్డ్ అసిస్టెంట్లు తలారి శివ, వినోద్ లతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అక్కడ ఏర్పాటు చేస్తున్న వాకింగ్ ట్రాక్…

Read More

ఈవీఎం గోడౌన్ తనిఖీ

విశాలాంధ్ర ధర్మవరం:: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ధర్మవరం పట్టణంలోని మార్కెట్ యార్డులో గల ఈవీఎం గోడౌన్ ను కలెక్టర్ శ్యాంప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గోడౌన్ పరిసరాలను వారు పరిశీలించారు. అనంతరం భద్రత, గోడానికి వేసిన తాళాల సీజ్ విధానం తదితర వాటిని వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధుల నడుమ పరిశీలించారు. అనంతరం గోడౌన్ భద్రత పట్ల అప్రమత్తంగా ఉండాలని, భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని అధికారులకు సూచించారు. తిరిగి రాజకీయ ప్రతినిధుల…

Read More

అక్రమ మట్టి తవ్వకాల పై మండిపడ్డ మాజీ మంత్రి వేణు

విశాలాంధ్ర – కడియం : తూర్పుగోదావరి జిల్లా, కడియం మండలం, పొట్టిలంక గ్రామంలోని అక్రమ మట్టి త్రవ్వకాలపై జిల్లా వైసిపి అధ్యక్షులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మండిపడ్డారు. మంగళవారం ఆయన పార్టీ క్యాడర్ తో కలిసి మట్టి త్రవ్వకాలు జరుగుతున్న ప్రాంతాన్ని పరిశీలించారు. సర్వే నెంబర్ 147 లో అక్రమంగా నది గర్భంలోని నల్లమట్టిని తవ్వుతూ నిబంధనలకు పాతర వేస్తూ తరలిస్తున్న మట్టి లారీలను జెసిబిలను ఈ బృందం గమనించింది. ఎన్జీటీ ప్రమాణికాల ప్రకారం నది తీర ప్రాంతాల్లో…

Read More

కాంగ్రెస్ కు జీవన్ రెడ్డి రాజీనామా

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. జగిత్యాలలో కార్యకర్తల సమక్షంలో తన రాజీనామా లేఖను విడుదల చేసిన ఆయన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పార్టీ హైకమాండ్ తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. గత 20 నెలలుగా పార్టీలో తీవ్రమైన మానసిక క్షోభకు గురవుతున్నానని, గౌరవం లేని చోట ఉండలేకే రాజీనామా నిర్ణయం తీసుకున్నానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ విధానాలకు విరుద్ధంగా…

Read More

శాంతి చర్చలతో మాకు సంబంధం లేదు..:ఇజ్రాయెల్

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను తగ్గించేందుకు అమెరికా చేస్తున్న శాంతి ప్రయత్నాలకు ఇజ్రాయెల్ గట్టి షాకిచ్చింది. ఇరాన్‌తో అమెరికా జరుపుతున్న చర్చలతో తమకు ఎలాంటి సంబంధం లేదని, ఆ దేశంపై తమ సైనిక దాడులు కొనసాగిస్తామని స్పష్టం చేసింది. తమ దేశ భద్రతకు ఇరాన్, దాని అనుబంధ సంస్థల నుంచి ముప్పు పొంచి ఉన్నంత కాలం ఈ వైఖరి మారదని తేల్చి చెప్పింది.ఇటీవల ఇరాన్ నూతన సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టిన మొజ్తబా ఖమేనీ శాంతి దిశగా మొగ్గు చూపుతున్నారనే…

Read More

కువైట్ విమానాశ్రయంపై ఇరాన్ దాడి – Visalaandhra

కువైట్: ఇరాన్ ఎక్కడా తగ్గడం లేదు. గల్ఫ్‌లోని అమెరికా స్థావరాలపై విరుచుకుపడుతోంది. ట్రంప్ ఆడిన నాటకాలకు తలొగ్గడం లేదు. ఇటీవల చర్చలు, యుద్ధానికి ఐదు రోజులు విరామం వంటి ప్రకటనలను బేఖాతరు చేస్తోంది. గల్ఫ్ దేశాలపై ఇరాన్ డ్రోన్‌లతో విరుచుకుపడుతోంది. కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం లక్ష్యంగా డ్రోన్ దాడికి పాల్పడింది. అయితే, అది ఓ ఇంధన ట్యాంకర్‌ను ఢీకొట్టడంతో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. బుధవారం తెల్లవారుజామున జరిగిన డ్రోన్ దాడిలో చమురు ట్యాంకర్ నుంచి భారీఎత్తున మంటలు…

Read More

అమెరికా ఎలా చెబితే మోదీ అలానే చేస్తారు

కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ విమర్శ న్యూదిల్లీ: ప్రదాని మోదీపై రాహుల్ గాంధీ మర్కొసారి విమర్శనాస్త్రాలు సంధించారు. అమెరికా, ఇజ్రాయిల్ ఎలా చెబితే మోదీ అలా చేస్తారని విమర్శించారు. ఆయనకు దేశ ప్రయోజనాలు కంటే అమెరికా ప్రయోజనాలే ఎక్కువని ఆరోపించారు. దేశ ప్రయోజనాలకు ప్రధాని కషి చేయరని తాను రాతపూర్వకంగా చెప్పగలనన్నారు. మన విదేశాంగ విధానంపైన మాట్లాడుతూ…మన విదేశాంగ విధానం ప్రధాని నరేంద్రమోదీ వ్యక్తిగతంగా మారిపోయిందని, అంతర్జాతీయ జోక్‌గా మిగిలిందని ఎద్దేవా చేశారు. పార్లమెంటు ఆవరణలో…

Read More

ఢిల్లీలోని పార్టీ ఆఫీసు ఖాళీ చేయాలంటూ కాంగ్రెస్ కు కేంద్రం నోటీసులు

దాదాపు ఐదు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకి చిరునామాగా ఉన్న ఢిల్లీలోని అక్బర్ రోడ్ కార్యాలయంపై కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ శనివారం (మార్చి 28)లోగా ఆ భవనాన్ని ఖాళీ చేయాలని స్పష్టం చేసింది. 1978 నుంచి అంటే గత 48 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యకలాపాలకు 24, అక్బర్ రోడ్ భవనం కేంద్రంగా ఉంది. ఈ కార్యాలయంతో పాటు, 5 రైసినా రోడ్‌లో ఉన్న ఇండియన్ యూత్ కాంగ్రెస్ ఆఫీస్‌ను కూడా…

Read More

జాబ్ క్యాలెండర్‌పై తీవ్రస్థాయిలో షర్మిల విమర్శలు

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, రాష్ట్ర ప్రభుత్వం ఉగాది నాడు విడుదల చేసిన జాబ్ క్యాలెండర్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కొండంత రాగం తీసి కూసింత పాట పాడినట్లుగా ఈ క్యాలెండర్ ఉందని, ఇది యువతను మోసం చేయడమేనని ఆమె ఆరోపించారు. జాబ్ క్యాలెండర్ పేరుతో నిరుద్యోగులను నిరాశపరిచారని అన్నారు.రాష్ట్రవ్యాప్తంగా 1.80 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉంటే, కేవలం 10 వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వడం యువతకు అన్యాయం చేయడమేనని షర్మిల పేర్కొన్నారు….

Read More