కావూరి సాంబశివరావు కన్నుమూత.. – Visalaandhra

తెలుగు రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు (82) తుదిశ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, హైదరాబాద్‌లోని స్టార్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ ఉదయం కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు అధికారికంగా ధృవీకరించారు. విద్యార్థి దశ నుంచి కేంద్ర మంత్రి వరకు: 1943లో జన్మించిన కావూరి సాంబశివరావు వరంగల్ నిట్ (అప్పట్లో ఆర్ఈసీ) నుంచి ఇంజనీరింగ్ పట్టా పొందారు….

Read More

ధర్మవరంలో పాత ఆసుపత్రి అభివృద్ధికి చర్యలు

విశాలాంధ్ర -ధర్మవరం; ధర్మవరం పట్టణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో పాత ప్రభుత్వ ఆసుపత్రిని 50 పడకల ఆసుపత్రి నుండి 100 పడకల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ చేయడానికి చర్యలు వేగవంతం అవుతున్నాయి. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ సహకారంతో ఈ ప్రతిపాదనపై అధికారులు పరిశీలన చేపట్టారు. మంత్రి సత్య కుమార్ యాదవ్ గారి ఆదేశాల మేరకు ఆరోగ్య శాఖ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ రమేష్ నాథ్‌తో కలిసి ఆయన నియోజకవర్గ…

Read More

ఆర్ఓబి పనులను వేగవంతం చేయండి..

మున్సిపల్ కమిషనర్ వెంకటరమణయ్య విశాలాంధ్ర ధర్మవరం ; ఆర్ఓబి పనులను ఆర్ అండ్ బి అధికారులు, ఆర్ఓబి కాంట్రాక్టర్లు వేగవంతం చేయాలని మున్సిపల్ కమిషనర్ వెంకట రమణయ్య తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ తన ఛాంబర్ లో వారితో అత్యవసర సమావేశాన్ని నిర్వహించి పలు విషయాలను తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రజలు ఎన్నో పనుల మీద పట్టణంలో వెళుతుంటారని అటువంటి వారికి ఆర్ఓబి పనులు జరగకపోవడం వలన ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని వారు తెలిపారు. అంతేకాక…

Read More

ప్రపంచవ్యాప్తంగా నిలిచిన ఇన్‌స్టా సేవలు.. వేలల్లో ఫిర్యాదులు

ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఇవాళ‌ ఉదయం నుంచి పలు సాంకేతిక సమస్యలు తలెత్తాయి. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది వినియోగదారులు తమ డైరెక్ట్ మెసేజ్‌లు (డీఎంలు) యాక్సెస్ చేయలేకపోతున్నామని, చాట్ థీమ్‌లు మాయమయ్యాయని ఫిర్యాదులు చేస్తున్నారు. సెర్చ్ టూల్ కూడా పనిచేయడం లేదని, కాంటాక్ట్స్ కనిపించడం లేదని ఇతర సోషల్ మీడియా వేదికల ద్వారా నెటిజన్లు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.తమకు మెసేజ్‌లు ఉన్నప్పటికీ, నోటిఫికేషన్లు వస్తున్నప్పటికీ మెసేజ్‌ల పేజీ మొత్తం ఖాళీగా కనిపిస్తోందని ఒక…

Read More

తెలంగాణ నూతన గవర్నర్‌గా శివ్ ప్రతాప్ శుక్లా ప్రమాణ స్వీకారం

తెలంగాణ రాష్ట్ర నూతన గవర్నర్‌గా శివ్ ప్రతాప్ శుక్లా బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ ఆయనతో ప్రమాణం చేయించారు. అయితే, ఉత్తరప్రదేశ్‌కు చెందిన శుక్లా అనూహ్యంగా తెలుగులో ప్రమాణం చేసి అక్కడున్న వారందరినీ ఆశ్చర్యపరిచారు. ఈయన తెలంగాణకు నాల్గవ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, శాసనసభ స్పీకర్ గడ్డం…

Read More

ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం.. విడతల వారీగా పెరగనున్న విమాన ఛార్జీలు

ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ప్రయాణికులపై అదనపు భారం మోపనుంది. మధ్యప్రాచ్యంలో ఇరాన్-అమెరికా యుద్ధం కారణంగా ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) ధరలు భారీగా పెరగడంతో తమ దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులపై ఫ్యూయల్ సర్ ఛార్జ్‌ను విడతల వారీగా పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం తీసుకోవడం విచారకరమని, కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ఈ భారాన్ని మోపాల్సి వస్తోందని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. విమానయాన సంస్థ నిర్వహణ వ్యయంలో దాదాపు 40 శాతం వాటా…

Read More

జల్ జీవన్ మిషన్ కాలపరిమితి పెంపు

2028 వరకు పొడిగించిన కేంద్ర క్యాబినెట్ న్యూదిల్లీ: ఇంటింటికీ కొళాయి ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో రక్షిత మంచినీరు అందించే జల్ జీవన్ మిషన్ పథకం అమలు కాలపరిమితిని కేంద్ర ప్రభుత్వం పెంచింది. 2028 డిసెంబరు వరకు పొడిగిస్తూ కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. 2019-2024 వరకే పరిమితమైన ఈ పథకం చాలా రాష్ట్రాల్లో పూర్తిస్థాయిలో అమలుకాని విషయాన్ని ప్రభుత్వం పరిగణనలో తీసుకుంది. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన మంగళవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం దీనిపై నిర్ణయం తీసుకుంది….

Read More

గ్యాస్ ధరల పెంపుపై వామపక్షాల సమరశంఖం

విశాలాంధ్ర, నెల్లిమర్ల /కంటోన్మెంట్ :​నెల్లిమర్ల విద్యుత్ స్టోర్స్ వద్ద మంగళవారం వామపక్షాల ఆధ్వర్యంలో భారీ నిరసన ప్రదర్శన జరిగింది. పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ, సీపీఎం నేతలు ముయ్యద పాపారావు, కిల్లంపల్లి రామారావు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం యుద్ధాన్ని సాకుగా చూపి కమర్షియల్ సిలిండర్‌పై ₹150, గృహ అవసరాల సిలిండర్‌పై ₹60 పెంచి సామాన్యుల నడ్డి విరిచిందని వారు మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలను గాలికి వదిలేసి…

Read More

ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి ఓట్లు అడిగే హక్కు లేదు

కాంగ్రెస్ పార్టీ నాయకులు తుప్పర్తి పరమేష్ విశాలాంధ్ర ధర్మవరం; ఆర్ డి టి స్వచ్ఛంద సేవా సంస్థకు ఎఫ్ సి ఆర్ ఏ ను రెన్యువల్ చేయకుండా ఎన్నో ఇబ్బందులకు గురి చేసిందని, అటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికల్లో ప్రజలను ఓట్లు అడిగే హక్కు కూటమి ప్రభుత్వానికి లేదు అని కాంగ్రెస్ పార్టీ నాయకులు తుంపర్తి పరమేష్ తెలిపారు. ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడుతూ ఉమ్మడి అనంతపురం జిల్లాకు తలమానికం పేద ప్రజల గుండెచప్పుడు అయిన…

Read More

చెరువు కట్ట బలోపేతానికి నిర్దిష్ట చర్యలు

-టీడీపీ మండల ఇంచార్జి ధర్మవరపు మురళీ విశాలాంధ్ర-రాప్తాడు : మండల కేంద్రంలోని రాప్తాడు చెరువు కట్టను బలోపేతానికి నిర్ధిష్ట చర్యలు చేపట్టడంపాటు నీటి వనరులకు జీవం పోసేందుకు సమగ్ర ప్రణాళికలు రూపొందించామని టీడీపీ మండల ఇంచార్జి ధర్మవరపు మురళీ తెలిపారు. రాప్తాడు, అయ్యవారిపల్లి మధ్యలోని చెరువు ప్రాంతంలో పునరుద్ధరణకు మంగళవారం ఏడీసీసీ చైర్మన్ ముంటిమడుగు కేశవరెడ్డి, డి.సి.ఎం.ఎస్ చైర్మన్ నెట్టెం వెంకటేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ సుధాకర్ నాయుడు, సర్పంచ్ సాకే తిరుపాలు, ప్రసన్నాయపల్లి శీనా, ఎంపీడీవో…

Read More