వాటర్ స్పోర్ట్స్ జిల్లా సాయి ఎంపికలు..

జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి కిషోర్విశాలాంధ్ర ధర్మవరం;; వాటర్ స్పోర్ట్స్ జిల్లా స్థాయి ఎన్నికలు పుట్టపర్తి లోని సాయి ఆక్వా బోటింగ్ చిత్రావతి నది వద్ద ఏప్రిల్ రెండవ తేదీన నిర్వహిస్తున్నట్లు జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి కిషోర్ తెలిపారు. వారు మాట్లాడుతూ అండర్- 15 సబ్ జూనియర్, అండర్- 18 జూనియర్ విభాగాల్లో జరిగే పోటీలలో గెలుపొందిన బాల బాలికలకు ఏప్రిల్ 11 నుంచి 12వ తేదీ వరకు ఎన్టీఆర్ జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి వాటర్…

Read More

అర్ధాంతరంగా నిలిచిపోయిన అంగన్‌వాడీ భవనం పూర్తి చేయాలి: సిపిఐ డిమాండ్…

విశాలాంధ్ర – నార్పల (అనంతపురం జిల్లా ): నార్పల మండల కేంద్రంలోని ఉయ్యాలకుంట కాలనీలో నిర్మాణం మధ్యలోనే నిలిచిపోయిన అంగన్‌వాడీ భవనాన్ని తక్షణమే పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో అంగన్‌వాడీ భవనాలకు అనుమతులు మంజూరైనప్పటికీ పనులు పూర్తికాకపోవడం విచారకరమని పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వం కూడా రెండేళ్లుగా ఈ అంశంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఎమ్మెల్యే అసెంబ్లీలో అంగన్‌వాడీ భవనాల సమస్యను ప్రస్తావించినప్పటికీ,…

Read More

కలెక్టరేట్ లో అగ్ని ప్రమాదాల పట్ల అవగాహన సదస్సు

విశాలాంధ్ర -అనంతపురం టౌన్: అనంతపురం కలెక్టరేట్ లోని రెవెన్యూ భవనం వద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు స్పందన మరియు అగ్నిమాపక సేవల శాఖ ఆధ్వర్యంలో సోమవారం అగ్ని ప్రమాదాల పట్ల జిల్లా అధికారులకు, ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఫైర్ అధికారి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ అగ్ని ప్రమాదాల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను, నీటి ప్రమాదాల పట్ల, ఎన్ని రకాల అగ్ని ప్రమాదాలు ఉన్నాయి, వాటిని ఆర్పే పద్ధతులు గురించి, కిచెన్ సేఫ్టీ గురించి,…

Read More

రైతులకు పంటతో పాటు పశుసంపద ఆర్థిక బలం

విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : రైతులకు పంటలతో పాటు పాటు పశుసంపద కూడా ఎంతో లాభం చేకూరుతుందని మంత్రాలయం మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ బొగ్గుల తిక్కన్న కార్తికేయ తెలిపారు.సోమవారం మంత్రాలయం వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆర్థిక సహకారంతో మండల పరిధిలోని కల్లుకుంట గ్రామంలో పశు వైద్య అధికారి డాక్టర్ దినకర్ ఆధ్వర్యంలో జరిగిన ఉచిత పశు వైద్య శిబిరాన్ని తిక్కన్న కార్తికేయ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతుల అభివృద్ధి పశు…

Read More

ముదిగుబ్బకు నియోజకవర్గ హోదా ఇవ్వాలి – సిపిఐ డిమాండ్

పునర్విభజనలో పక్కన పెడితే ఉద్యమాలు తప్పవు – సిపిఐ మండల కార్యదర్శి చల్లా శ్రీనివాసులు హెచ్చరిక విశాలాంధ్ర, ముదిగుబ్బ,శ్రీ సత్యసాయి జిల్లా : మండల కేంద్రమైన ముదిగుబ్బ పట్టణాన్ని ప్రత్యేక నియోజకవర్గ కేంద్రంగా ప్రకటించాలని సిపిఐ మండల కార్యదర్శి చల్లా శ్రీనివాసులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నియోజకవర్గాల పునర్విభజన నేపథ్యంలో ముదిగుబ్బను తిరిగి కదిరి నియోజకవర్గంలో విలీనం చేసే అవకాశాలపై వస్తున్న వార్తలు మండల ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయని తెలిపారు.ముదిగుబ్బ మండలం విస్తీర్ణం, జనాభా పరంగా జిల్లాలోనే…

Read More

చెరువుపల్లి మాల్యాద్రి సేవలకు గుర్తింపు – Visalaandhra

20సంవత్సరాలు మండలపార్టీ బాధ్యతలు ఘనంగా సన్మాణించిన ఎమ్మెల్యే ఇంటూరి విశాలాంద్ర -వలేటివారిపాలెం(ప్రకాశం జిల్లా ) : వలేటివారిపాలెం మండలంలోని చుండి గ్రామానికి చెందిన టిడిపి సీనియర్ నాయకులు చెరువుపల్లి మాల్యాద్రిని తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆదివారం కందుకూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు పార్టీకి చేసిన సేవలు గుర్తించి ఘనంగా సన్మానించారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ వెన్నంటే ఉండి ఎన్ని కష్టాలు వచ్చినా పార్టీని వదలకుండా…

Read More

క్రికెట్ బెట్టింగ్ జోలికి వెళ్ళకండి: నార్పల ఎస్సై సాగర్ హెచ్చరిక

విశాలాంధ్ర – నార్పల (అనంతపురం జిల్లా): క్రికెట్ బెట్టింగ్‌లకు దూరంగా ఉండాలని, వాటి వల్ల జీవితాలు నాశనం చేసుకోకూడదని నార్పల ఎస్సై సాగర్ ప్రజలకు సూచించారు. బెట్టింగ్‌లో పాల్గొనేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, క్రికెట్ మ్యాచ్‌ల సమయంలో ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ బెట్టింగ్‌లు పెరుగుతున్నాయని, ముఖ్యంగా యువత వీటి బారిన పడుతున్నారని తెలిపారు. బెట్టింగ్ చట్టవిరుద్ధమని, అలాంటి కార్యకలాపాల్లో పాల్గొంటే కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.బెట్టింగ్‌ను అరికట్టేందుకు…

Read More

టిడిపి వారు రాజధాని పేరుతో చేస్తున్న భూ దందాకు మాత్రమే వైయస్సార్ పార్టీ వ్యతిరేకం

మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి విశాలాంధ్ర ధర్మవరం : రాష్ట్రంలోని అమరావతిపై కూటమినేతలు చేస్తున్న అసత్య ప్రచారాలను తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు తమ పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ అమరావతి రాజధానికి వైయస్సార్ పార్టీ ఎప్పుడు కూడా వ్యతిరేకము కాదు అని, టిడిపి వారు రాజధాని పేరుతో చేస్తున్న భూ దందాకు మాత్రమే వైయస్సార్ పార్టీ వ్యతిరేకమని వారు స్పష్టం చేశారు. రైతులకు జరుగుతున్న అన్యాయంపై నిరంతరము…

Read More

నామినేషన్ దాఖలు చేసిన ముఖ్యమంత్రి స్టాలిన్

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, టీవీకే అధ్యక్షుడు విజయ్ నామినేషన్లు దాఖలు చేశారు. ముఖ్యమంత్రి స్టాలిన్ వరుసగా మూడుసార్లు కొళత్తూరు నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ఆయన ఈసారి కూడా అక్కడి నుంచే బరిలోకి దిగుతున్నారు. నామినేషన్ పత్రాలను సమర్పించిన అనంతరం ముఖ్యమంత్రి రోడ్డు షో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఢిల్లీకి వ్యతిరేకంగా తమిళనాడు పోరాడుతోందని అన్నారు. ఈసారి గొప్ప విజయాన్ని అందుకోబోతున్నామని కార్యకర్తలను, అభిమానులను ఉద్దేశించి అన్నారు. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన…

Read More

ఏపీలో నేడు 2.5 లక్షల ఇళ్లలో సామూహిక గృహప్రవేశాలు

ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పేదల గృహ నిర్మాణ పథకంలో భాగంగా మరో కీలక ఘట్టానికి తెరలేచింది. రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ‌ ఏకకాలంలో 2.5 లక్షల ఇళ్లలో సామూహిక గృహప్రవేశ కార్యక్రమాన్ని ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గంలోని నాయుడుపేట మండలం పుదూరులో జరిగే ప్రధాన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొని లబ్ధిదారులతో గృహప్రవేశాలు చేయించనున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భారీ స్థాయిలో ఇళ్ల పంపిణీ చేపట్టడం ఇది రెండోసారి….

Read More