మరో కొత్త వీడియో విడుదల చేసిన నెతన్యాహు…

ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమన్ నెతన్యాహు తాజాగా మరో వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇరాన్ దాడుల్లో నెతన్యాహు మరణించారంటూ జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో కొత్త వీడియోను పోస్ట్ చేస్తూ తాను ఆరోగ్యంగా ఉన్నానని ఆయన వెల్లడించారు. ఓ పర్యాటక ప్రాంతంలో తీసిన ఈ వీడియోలో నెతన్యాహు జనంలోకి వెళ్లడం, వారిని పలకరించడం చూడొచ్చు. ఇటీవల నెతన్యాహు పోస్ట్ చేసిన వీడియో ఏఐ సాయంతో రూపొందించిందని అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆయన చేతికి ఆరు వేళ్లు ఉన్నాయన్న…

Read More

కనుల పండువగా ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం

‘వన్ బ్యాటిల’ ఉత్తమ చిత్రంతో పాటు 6 అవార్డులులాసఏంజెల్స్: 98వ ఆస్కార్ (2026) అవార్డుల ప్రదానోత్సవం లాస్ ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో కనుల పండువగా జరిగింది. ఈ ఏడాది ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర’ చిత్రం ఉత్తమ చిత్రంగా నిలిచి సత్తా చాటింది. ఈ సినిమా ఏకంగా 6 విభాగాల్లో ఆస్కార్ పురస్కారాలను కైవసం చేసుకుంది. రికార్డు స్థాయిలో 16 నామినేషన్లు పొందిన ‘సిన్నర్స’ చిత్రం కేవలం నాలుగు అవార్డులతోనే సరిపెట్టుకుంది.పాల్ థామస్ అండర్సన్ దర్శకత్వం వహించిన…

Read More

ఇజ్రాయిల్ దాడిలో13 మంది పలస్తీనియన్ల మృతి

గజా: ఇజ్రాయిల్ వైమానిక దళం గజాపై బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడిలో 13 మంది పలస్తీనియన్లు మృతి చెందారు ఇద్దరు బాలురు, ఓ గర్భిణీ మహిళ, 9మంది పోలీసు అధికారులతో సహా 13 మంది చెందినట్లు తాజాగా గజా ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. ఆదివారం రాత్రి సెంట్రల్ గాజాలోని నుసెయిరాత్ పట్టణ శరణార్ధి శిబిరంలోని ఒక ఇంటిపై ఇజ్రాయిల్ సైన్యం జరిపిన దాడిలో నలుగురుమతిచెందారు. వీరిలో 30 ఏళ్ల వయసున్న జంట, వారి పదేళ్ల కుమారుడు…

Read More

నాటో దేశాలకు ట్రంప్ హెచ్చరిక

వాషింగ్టన్: పశ్చిమాసియాలో అంతకంతకూ యుద్ధం తీవ్రమవుతున్న తరుణంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన యూరోపియన్ మిత్రదేశాలపై నిప్పులు చెరిగారు. నార్త్ అట్లాంటిక్ ట్రెటీ ఆర్గనైజేషన్ (నాటో) భవిష్యత్తుపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ… ప్రస్తుత పరిస్థితి చాలా దారుణంగా ఉందని వ్యాఖ్యానించారు. ఇరాన్ అడ్డంకుల వల్ల మూతపడిన హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరిపించేందుకు తమతో కలిసి రావాలని నాటో కూటమిని ఆయన డిమాండ్ చేశారు. హోర్ముజ్ జలసంధి ద్వారా చమురు పొందుతున్న దేశాలు తమ…

Read More

నేపాల్‌లో దడపుట్టిస్తున్న పెట్రోల్, డీజిల్ ధరలు

కాట్మండు: పశ్చిమాసియాలో చెలరేగుతున్న యుద్ధ సెగలు ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలను అతలాకుతలం చేస్తున్నాయి. నేపాల్‌లో పెట్రో ధరలు రాత్రికి రాత్రి రికార్డు స్థాయికి చేరాయి. నేపాల్ ఆయిల్ కార్పొరేషన్ తీసుకున్న సంచలన నిర్ణయంతో సోమవారం నుంచి పెరిగిన ధరలు అమల్లోకి వచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరగడం, సరఫరా వ్యవస్థలో అంతరాయాల కారణంగా నేపాల్ ప్రభుత్వం ఇంధన ధరలను భారీగా సవరించింది. పెట్రోల్ లీటరుకు రూ.31 పెరగడంతో ఇప్పుడు రూ.188 కి చేరింది….

Read More

యుద్ధరంగంలో ఇరాన్ డ్యాన్సింగ్ మిస్సైల్

ఒట్టావా(కెనడా): ఇజ్రాయిల్, అమెరికా దాడులకు ప్రతిగా ఇరాన్ తొలిసారిగా డ్యాన్సింగ్ మిస్సైల్‌గా పిలువబడే ‘సెజ్జిల్-2’ ని వినియోగించింది. ఈ విషయాన్ని అంతర్జాతీయ మీడియా వర్గాలు వెల్లడించాయి. ఇరాన్ స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ఈ క్షిపణిని అషౌరా అనే పేరుతో కూడా పిలుస్తారు. సుదూరప్రాంతాల్లోని లక్ష్యాలను ఇది సమర్థంగా ధ్వంసం చేయగలదు. దీని ప్రత్యేకత ఏంటంటే… ఇరాన్ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ డ్యాన్సింగ్ మిసైల్ పరిధి 2,000 కిలోమీటర్లకు పైనే ఉంటుంది. ఏకంగా 700 కిలోల…

Read More

అమెరికాకు మిత్రదేశాల షాక్

హోర్ముజ్‌కు యుద్ధనౌకల్ని పంపట్లేదని వెల్లడిసిడ్నీ/టోక్యో: ఇజ్రాయిల్‌తో కలిసి ఇరాన్‌పై భీకర దాడులకు తెగబడుతున్న అమెరికాకు ఎదురుదెబ్బ తగిలింది. ఇరాన్ పరిధిలోని కీలక హోర్ముజ్ జలసంధిలో మోహరింపు కోసం యుద్ధనౌకలను పంపా లని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన సూచనను అనేక అమెరికా మిత్ర దేశాలు తిరస్కరించినట్లు సమాచారం. వీటిలో కొన్ని దేశాలు ఆచితూచి స్పందిస్తుండగా, ఇంకొన్ని దేశాలు కుదరదని తెగేసి చెబుతున్నాయి. హోర్ముజ్ జలసంధి వద్దకు కానీ, పశ్చిమాసియా ప్రాంతానికి కానీ తమ యుద్ధ నౌకను పంపేది…

Read More

హ్యాపీ ఉగాది – Visalaandhra

చింతపట్ల సుదర్శన్ అర్ధరాత్రి దాకా దోమలతో ఫైట్ చేసి అలసిపోయిన డాంకీకి తెల్లవారుఝామున చల్లగాలికి కునుకు పట్టింది. తాను ఒకటి తలిస్తే డాగీ ఇంకొకటి తలుస్తుంది కదా. ఉండి ఉండి ‘భౌభౌ’లు మొదలుపెట్టింది. దీని కూసే టైం మొదలైందన్నమాట. ఎవడైనా అరుగు పక్కనించి నడుస్తూ కనపడ్డాడో, ఎదురుగ్గా ఉన్న వేపచెట్టు కొమ్మ ఏదైనా గాలికి ఊయల్లూగిందో. ఇక ఇది అరుపులు మొదలు పెట్టిందంటే అసెంబ్లీ సమావేశాలు మొదలైనట్టే అనుకుని కళ్ళు గట్టిగా ఒత్తి పట్టుకుంది. కళ్లయితే మూయగలిగింది…

Read More

రాష్ట్రంలో భావజాల విధ్వంసం!

సంగిరెడ్డి హనుమంత రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నేడు మూడు ప్రక్రియలు చోటుచేసుకున్నాయి. అనవసర అంశాలను తెరపైకి తెచ్చి అసలు సమస్యల నుంచి ప్రజల దృష్టిని మరల్చడం. తిరుమల “కల్తీ”లడ్డు తిని ఎందరు చనిపోయారో తెలియదు. పాలకుల దృష్టిలో అది సర్వజన సంహారిణి. ఆహార ముడి పదార్థాల, హోటళ్ళలో ఆహార కల్తీలను, భూజల, వాయు, శబ్ద పర్యావరణ కాలుష్యాలను పట్టించుకోరు. గుడి గోడలు కూలి, దర్శనాల క్యూలో తోపుళ్ళకు ప్రాణాలు పోగొట్టుకున్న భక్తులు కనపడరు. రోడ్ల ప్రమాదాల్లో రోజూ…

Read More

ఆఖరి అస్త్రంగా జ్ఞానేశ్‌పై ఇంపీచ్‌మెంట్ నోటీసు

అరుణ్ శ్రీవాస్తవ లోక్‌సభ్ స్పీకర్ ఓం బిర్లాను తొలగించాలని ప్రతిపక్షాలు ప్రతిపాదించిన తీర్మానం మూజువాణీ ఓటుతోనే వీగిపోయింది. అయినా ఎన్నికల కమిషన్ ప్రధానాధికారి జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా రాజ్యసభ, లోక్‌సభకు చెందిన 193 మంది గత 13వ తేదీన ఇంపీచ్‌మెంట్ నోటీసు ఇచ్చారు. ప్రతిపక్షాల ఈ ప్రయత్నం నెగ్గుతుందనుకోలేం. కానీ ఇదీ ఒక రకమైన అభిశంసనే. ఇది రాజకీయ చర్చకు దారి తీసింది.ఎన్నికల కమిషన్ ప్రధానాధికారి “పక్షపాత ధోరణి” అనుసరిస్తున్నారని, “ఓట్ చోరీకి సహకరిస్తున్నారు” అని ప్రతిపక్షాలు…

Read More