ఏపీలో నేడు 2.5 లక్షల ఇళ్లలో సామూహిక గృహప్రవేశాలు
ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పేదల గృహ నిర్మాణ పథకంలో భాగంగా మరో కీలక ఘట్టానికి తెరలేచింది. రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ ఏకకాలంలో 2.5 లక్షల ఇళ్లలో సామూహిక గృహప్రవేశ కార్యక్రమాన్ని ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గంలోని నాయుడుపేట మండలం పుదూరులో జరిగే ప్రధాన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొని లబ్ధిదారులతో గృహప్రవేశాలు చేయించనున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భారీ స్థాయిలో ఇళ్ల పంపిణీ చేపట్టడం ఇది రెండోసారి….


