నేడు ఏపీలో వర్షాల జోరు.. తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు!


తెలంగాణ నుంచి రాయలసీమ, తమిళనాడు మీదుగా మన్నార్‌ వరకు ద్రోణి విస్తరించి ఉన్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.ఈ ద్రోణి ప్రభావంతో మంగళవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు కాకినాడ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, కర్నూలు, నంద్యాల, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది.
అలాగే మిగతా జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని సూచించింది.

గూడూరులో అత్యధిక వర్షపాతం
ఇక రాష్ట్రంలో గత 24 గంటల వర్షపాతం వివరాలను వెల్లడించిన సంస్థ.. ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచి సోమవారం సాయంత్రం 5 గంటల వరకు నెల్లూరు జిల్లా గూడూరులో అత్యధికంగా 40 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు తెలిపింది.పల్నాడు జిల్లా నెమలికల్లులో 25 మిల్లీమీటర్లు, తిరుపతి జిల్లా వెంకటగిరిలో 24.2 మిల్లీమీటర్లు, శ్రీసత్యసాయి జిల్లా రత్నగిరి మరియు అనంతపురం జిల్లా హంపాపురంలో చెరో 22 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వివరించింది



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *