రోగులకు వైద్య సేవలో పాస్టర్ ఓపిడి సేవలు


ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ తిపేంద్రనాయక్
విశాలాంధ్ర ధర్మవరం;; ప్రభుత్వ ఆసుపత్రిలో టెక్నాలజీతో రోగులకు వైద్య సేవలను మరింత త్వరితగతంగా అందించేందుకు ఫాస్టర్ ఓపిడి సేవలను అమలు పరచడం జరిగిందని ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ తిప్పేంద్ర నాయక్ తెలిపారు. వారు మాట్లాడుతూ గతంలో ప్రభుత్వ ఆసుపత్రిలో ఓపి స్లిప్పు కావాలి అంటే గంటలకొద్దీ క్యూలో రోగులు నిలబడవాల్సి వచ్చిందని, అలా గాకుండా స్మార్ట్ ఫోన్ ఉన్నవారు ఓపిడి సేవలో స్కానర్ క్యూఆర్ ను తీసుకుంటే ఓపి నెంబర్ వస్తుందని, తద్వారా ఓపి పక్కనే కంప్యూటర్ కేంద్రంలో ఓ పి నెంబర్ తెలిపితే వెనువెంటనే ఓపి స్లిప్పు ఇవ్వడం జరుగుతుందని వారు తెలిపారు. దీని ద్వారా నేరుగా సంబంధిత డాక్టర్ వద్దకు వెళ్లి రోగమును చూపించుకునే అవకాశం త్వరగా జరుగుతుందని తెలిపారు. కావున ఈ అవకాశమును రోగులు, వారి వద్ద గల సహాయకులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *