Last Updated: May 22, 2026, 21:06 IST
ఏపీలో ఎండలు మండిపోతున్నాయి. రానున్న 3 రోజులు అతి తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. దీంతో ఏలూరు, కృష్ణా, NTR, బాపట్ల, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. నెల్లూరు, ప.గో, కోనసీమ, తూ.గో, కాకినాడ, అనకాపల్లి జిల్లాలకు ఆరెంజ్, అల్లూరి, పోలవరం, విశాఖ, పార్వతీపురం జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది.


