తిరుపతి జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన మొబైల్ రికవరీ మేళా ప్రజల్లో విశేష స్పందనను రేకెత్తించింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వినియోగిస్తూ పోలీసులు మరోసారి తమ పనితీరును నిరూపించారు. 14వ దశ మొబైల్ రికవరీ కార్యక్రమంలో భాగంగా సుమారు రూ.1 కోటి విలువైన 500 మొబైల్ ఫోన్లను గుర్తించి అసలు యజమానులకు తిరిగి అందజేశారు. CEIR (సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్) పోర్టల్ సహకారంతో ఈ ఫోన్లను ట్రాక్ చేసి రికవరీ చేయడం జరిగింది. తమ విలువైన మొబైల్ ఫోన్లు తిరిగి దక్కడంతో బాధితులు పోలీసులపై కృతజ్ఞతలు వ్యక్తం చేశారు.#TirupatiPolice #MobileRecoveryMela #apnews
Source link


