‘మత్స్యకారుల సేవలో’ పథకం కింద వరుసగా రెండో ఏడాది నిధులు విడుదల చేసినందుకు మత్స్యకార కుటుంబాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. వేట నిషేధ సమయంలో ఒక్కో కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక భరోసా అందిస్తోన్న ప్రభుత్వ చర్యలు మత్స్యకారుల జీవనోపాధిని కాపాడుతున్నాయి. గత ఏడాది 1,21,433 కుటుంబాలకు రూ.243 కోట్లు అందజేశారు. ఈ ఏడాది 1,30,796 మత్స్యకార కుటుంబాలకు రూ.262 కోట్లు అందించారు. రెండేళ్లలో మొత్తం రూ.505 కోట్ల సాయం అందించినట్లు అధికారులు వెల్లడించారు.



