ఉష్ణోగ్రతలు తెలంగాణలో మాగ్జిమం 39 డిగ్రీల సెల్సియస్ ఉంటాయి. ఏపీలో 39 నుంచి 41 డిగ్రీల సెల్సియస్ ఉంటాయి. రాయలసీమ పశ్చిమ ప్రాంతంలో ఎండ ఎక్కువగా ఉంటుంది. తేమ తెలంగాణలో 26 శాతం, ఏపీలో 34 శాతం ఉంటుంది. అందువల్ల ఏపీ, తెలంగాణ ప్రజలు ఇవాళ ఎండను తేలిగ్గా తీసుకోవద్దు. మేఘాలు ఉన్నా.. ఎండ కూడా ఉంటుంది. ముఖ్యంగా రాయలసీమలోని అనంతపురం, నంద్యాల, కర్నూలు, ప్రొద్దుటూరు, పులివెందుల, కడప, డోన్, గుంతకల్ ప్రాంతాల్లో ఎక్కువ వేడి ఉంటుంది.



