సీఎం చంద్రబాబు సమీక్షలో కీలక ఆదేశాలు జారీ చేశారు. “ఈ రోజు (ఏప్రిల్ 27) సాయంత్రానికి మెజారిటీ ప్రాంతాల్లో సాధారణ స్థితి ఏర్పడుతుంది” అని అధికారులు, ఆయిల్ కంపెనీల ప్రతినిధులు ముఖ్యమంత్రికి వివరించారు. ఉదయం డిస్పాచ్ సెంటర్ల నుంచి బయలుదేరిన ఆయిల్ ట్యాంకర్లు సాయంత్రం వరకు రిటైల్ బంకులకు చేరుకుంటాయని తెలిపారు.
– పెట్రోల్, డీజిల్ సరఫరాలో సాధారణ పరిస్థితిని తీసుకురావడానికి అధికారులు, ఆయిల్ కంపెనీలు సమన్వయంతో పని చేయాలి.
– కలెక్టర్లు, ఎస్పీల స్వయంగా పర్యవేక్షణలో ప్రజలు ఇబ్బంది పడకుండా సరఫరా జరిగేలా చూడాలి.
– ఆయిల్ డిస్పాచ్ సెంటర్లకు కలెక్టర్లు, ఉన్నతాధికారులు వెళ్లి సరఫరాను నేరుగా పర్యవేక్షించాలి.
– ఆర్టీజీ సెంటర్ ద్వారా జిల్లాల పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించి, ప్రతి 3 గంటలకు ఒకసారి నివేదిక ఇవ్వాలి.
– మీడియా, సోషల్ మీడియాలో వస్తున్న కథనాలు, క్షేత్రస్థాయి సమాచారం ఆధారంగా అధికారులు తక్షణం స్పందించాలి.
– డిపోల నుంచి బంకులకు ఆయిల్ ట్యాంకర్లు ఎటువంటి జాప్యం లేకుండా చేరేలా చర్యలు తీసుకోవాలి.
– బ్లాక్ మార్కెట్ లేదా కృత్రిమ కొరత సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.
ప్రజలకు సూచన: అనవసరమైన ప్యానిక్ కొనుగోళ్లు మానండి. అవసరానికి మించి ఇంధనం నింపకండి. సరఫరా సాధారణమైన తర్వాత సాఫీగా అందుబాటులో ఉంటుంది.


