సాధారణ ప్రజలపై ఇలాంటి ఖర్చు ప్రభావం భారీగా ఉంటుంది. పేద, మధ్య తరగతి కుటుంబాలు క్రౌడ్ఫండింగ్పై ఆధారపడతాయి. పునర్విక కేసు లాగా సోషల్ మీడియా సహాయం అందుతుంది కానీ అందరికీ అది సాధ్యం కాదు. ఇండియాలో నేషనల్ పాలసీ ఫర్ రేర్ డిసీజెస్ ఉంది కానీ ఫండింగ్ పరిమితం. ఇలాంటి చికిత్సలు బీమా పథకాల్లో చేర్చాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రయోజనం ఏంటంటే,, ఇది పాపను పూర్తిగా కాపాడుతుంది. న్యూసిన్సెన్, రిస్డిప్లామ్ వంటి ఇతర చికిత్సలైతే జీవితాంతం కొనసాగాలి, ఖర్చు ఎక్కువవుతుంది. కానీ పాపకు వచ్చిన జోల్జెన్స్మాకి మళ్లీ చికిత్స అవసరం లేదు. ఒక్కసారి తోనే పాప జీవితం మారిపోయినట్లే. కోలుకున్నట్లే.



