సాగర నగరంలో ఆర్గానిక్ సంత సందడి.. ఆరోగ్యానికి కొత్త మార్గం చూపుతున్న ప్రకృతి రైతులు..! organic market movement attracting people every sunday. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)


Last Updated:

విశాఖలో ప్రతి ఆదివారం ఏ హబ్ మద్దిలపాలెంలో ఆర్గానిక్ సంత, రసాయన రహిత బియ్యం పప్పులు కూరగాయలు వస్త్రాలు విక్రయం, ఆరోగ్య అవగాహన వర్క్‌షాపులు ఆకర్షణగా మారుతున్నాయి

+

ఆర్గానిక్

ఆర్గానిక్ ఉత్పత్తులు భుజించండి ఆరోగ్యంగా ఉండండి…!

విశాఖపట్నంలో ఆరోగ్యంపై అవగాహన పెంచే ఒక ప్రత్యేక ఉద్యమం నిశ్శబ్దంగా కానీ ప్రభావవంతంగా ముందుకు సాగుతోంది. పెరుగుతున్న వ్యాధులు, ముఖ్యంగా క్యాన్సర్ వంటి ప్రమాదకర సమస్యల నేపథ్యంలో ప్రజలు తీసుకునే ఆహారంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతగానో ఉందని గ్రీన్ క్లైమేట్ టీం నిర్వాహకులు జేవి రాత్రం చెబుతున్నారు. రోజూ మనం తినే కూరగాయలు, ధాన్యాల్లో ఉండే క్రిమిసంహారక మందుల అవశేషాలు ఆరోగ్యానికి పెద్ద ముప్పుగా మారుతున్నాయని ఆయన హెచ్చరిస్తున్నారు.

ఈ పరిస్థితుల్లోనే ప్రకృతి ఆధారంగా సాగు చేసిన ఆర్గానిక్ ఉత్పత్తుల ప్రాముఖ్యత మరింత పెరిగింది. ఎటువంటి కెమికల్స్ లేకుండా పండించిన ఆహారం తీసుకుంటేనే నిజమైన ఆరోగ్యం సాధ్యమని నిపుణులు సూచిస్తున్నారు. ఇదే లక్ష్యంతో విశాఖలో ప్రతి ఆదివారం నిర్వహిస్తున్న ఆర్గానిక్ సంత ప్రజలను ఆకర్షిస్తోంది.

పూర్వం మన పెద్దలు ఎటువంటి మందులు లేకుండా పండిన పంటలను తింటూ ఆరోగ్యంగా జీవించేవారని, కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని ప్రకృతి వ్యవసాయ సంఘం నిర్వాహకులు చలపతిరావు గుర్తుచేస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో లభించే చాలా ఆహార పదార్థాలు రసాయనాలతో నిండిపోయి ఉండటంతో అనేక రకాల వ్యాధులు పెరుగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో గో ఆధారిత ప్రకృతి రైతులు కలిసి విశాఖ నగరంలో ఒక ఆర్గానిక్ సంతను ప్రారంభించారు. మొదట కొంతమంది రైతులతో మొదలైన ఈ సంత ఇప్పుడు విస్తరించి అన్ని రకాల ఆర్గానిక్ ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకొచ్చింది. బియ్యం, పప్పులు, తాజా కూరగాయలు, చెక్క గానుగ నూనెలు, బెల్లం, ఖాదీ మరియు చేనేత వస్త్రాలు ఇలా విభిన్న ఉత్పత్తులు ఒకేచోట లభించడం ప్రత్యేకతగా మారింది.

అంతేకాకుండా ఈ సంతలో కేవలం అమ్మకాలు మాత్రమే కాకుండా ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. కంపోస్టింగ్, టెర్రస్ గార్డెనింగ్, బయో ఫెర్టిలైజర్స్ వంటి అంశాలపై వర్క్‌షాపులు నిర్వహిస్తూ ప్రజల్లో సహజ జీవన విధానంపై ఆసక్తి పెంచుతున్నారు.

ఆంధ్ర విశ్వవిద్యాలయం సమీపంలోని ఏ హబ్, మద్దిలపాలెంలో ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ సంత జరుగుతోంది. ఆరోగ్యంగా ఉండాలంటే మన ఆహారపు అలవాట్లు మారాల్సిందేనని, అందుకోసం ప్రతి ఒక్కరూ ఆర్గానిక్ ఉత్పత్తులను వినియోగించాలంటూ నిర్వాహకులు పిలుపునిస్తున్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం అనే మాటను నిజం చేస్తూ, ప్రకృతి మార్గంలో సాగుతున్న ఈ సంత విశాఖ ప్రజలకు ఒక కొత్త జీవన దిశను చూపుతోంది.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *