అరుణాచలం వెళ్లాలనుకునేవారికి హైదరాబాద్, విశాఖపట్నం నుంచి డైరెక్ట్ ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి. రైలు నెంబర్ 17615 కాచిగూడ-ట్యుటికోరిన్ ఎక్స్ప్రెస్ ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు కాచిగూడలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7.28 గంటలకు తిరువన్నామలై చేరుకుంటుంది. ఈ రైలు దారిలో షాద్నగర్, జడ్చర్ల, మహబూబ్నగర్, వనపర్తి రోడ్, గద్వాల్ జంక్షన్, కర్నూల్ సిటీ, ఢోన్, గుత్తి, అనంతపురం, ధర్మవరం జంక్షన్, కదిరి, మదనపల్లె రోడ్డు, పీలేరు, పాకాల జంక్షన్, చిత్తూరు, కాట్పాడి జంక్షన్, వెల్లూరు కాంట్ స్టేషన్లలో ఆగుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)



