1948 జనగణన చట్టం ప్రకారం తప్పుడు సమాచారం ఇచ్చినా, అధికారులను అడ్డుకున్నా కఠిన శిక్షలు ఉన్నాయి. కానీ ఇది భయపెట్టడానికి కాదు. సరైన డేటా ద్వారా మన రాష్ట్రం మరింత మంచి పాలన, మంచి సౌకర్యాలు పొందడానికి మాత్రమే. ఏపీలో సెల్ఫ్ ఎన్యుమరేషన్ ఏప్రిల్ 16 నుంచి 30 వరకు ఉంది. ఈ సమయంలో ప్రజలు స్వయంగా తమ డేటాను యాప్లో ఎంటర్ చేసుకోవచ్చు. ఇందుకు ఏపీ సచివాలయ ఉద్యోగులు సహకారం అందిస్తారు. ప్రభుత్వ గృహ గణన మే 1 నుంచి 30 వరకు జరుగుతుంది. ఇది మొదటి దశ. ఇది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ 2026 వరకు దేశవ్యాప్తంగా కొనసాగుతుంది.
చివరి జనగణన 2011లో జరిగింది. ఆ తర్వాత 16 ఏళ్లు గడిచాయి. ఇప్పుడు జనాభా మార్పులు, నగరాల విస్తరణ, గ్రామాల అభివృద్ధి. అన్నీ కొత్త డేటాతో అంచనా వేయాలి. ఏపీలో ఇది ప్రత్యేకంగా ముఖ్యం ఎందుకంటే.. అమరావతి, విశాఖ, కాకినాడ వంటి నగరాల అభివృద్ధి, రైతు సంక్షేమం, విద్య, వైద్యం పథకాలు ఈ డేటా మీద ఆధారపడతాయి.
సరైన డేటా లేకపోతే ప్రభుత్వం తప్పు నిర్ణయాలు తీసుకుంటుంది. ఉదాహరణకు, 2011 జనగణన ఆధారంగా మన రాష్ట్రంలో ఎన్ని పాఠశాలలు, ఆసుపత్రులు నిర్మించారో ఆలోచించండి. ఇప్పుడు డిజిటల్ జనగణన.. మొబైల్ యాప్ ద్వారా, సెల్ఫ్ ఎన్యుమరేషన్ ద్వారా మరింత కచ్చితమైన ఫలితాలు వస్తాయి ఏపీ క్యాబినెట్ తెలిపింది.
ఏపీ ప్రజలకు అలర్ట్.. జనాభా లెక్కల్లో తప్పు చెబితే ఫైన్, జైలు శిక్ష కూడా!
తప్పుడు సమాచారం ఇస్తే ఏమవుతుంది?
సెక్షన్ 11 ప్రకారం రూ.1,000 వరకు జరిమానా విధిస్తారు. ఇది కేవలం జరిమానా కాదు. మీ డేటా కచ్చితత్వం మీద ఆధారపడి రాష్ట్ర అభివృద్ధి ఉంటుంది. ఉదాహరణ చూస్తే.. ఇంటి సౌకర్యాలైన LPG, ఇంటర్నెట్, నీటి సౌకర్యం వంటివి తప్పుగా చెప్పితే ప్రభుత్వం తప్పుగా పథకాలు తయారు చేసే ప్రమాదం ఉంటుంది.
3 ఏళ్ల వరకు జైలు శిక్ష + జరిమానా ఉంటుంది. ఇంటికి వచ్చిన ఎన్యూమరేటర్ను అడ్డుకోవడం, ఇంటి నంబర్ గుర్తులు తొలగించడం కూడా నేరమే.
ఇవి కఠినంగా అనిపించవచ్చు కానీ, ఇది మన అందరి కోసమే. డేటాని దాయకూడదు. సెక్షన్ 15 ప్రకారం ఈ డేటాని కేంద్రం, ఏపీ ప్రభుత్వం ఎవరికీ ఇవ్వవు. కేవలం గణాంకాలకు మాత్రమే ఉపయోగిస్తారు
– సెల్ఫ్ ఎన్యుమరేషన్: ఏప్రిల్ 16-30 మధ్య se.census.gov.in పోర్టల్లో ఆన్లైన్లో.. ప్రజలు స్వయంగా తమ వివరాల్ని నమోదు చేసుకోవచ్చు.
– గృహ గణన (House Listing): మే 1-30 మధ్య.. ఎన్యూమరేటర్లు ముఖ్యంగా టీచర్లు.. ఇళ్లకు వెళ్లి 33 ప్రశ్నలు అడుగుతారు. ఇంటి నిర్మాణం, సౌకర్యాలు, ఆస్తులు మొదలైనవి అడుగుతారు.
దేశవ్యాప్తంగా ఈ దశ ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ 2026 వరకు 30 రోజుల పాటు రాష్ట్రాల వారీగా జరుగుతుంది. రెండో దశ.. జనాభా గణన అనేది ఫిబ్రవరి 2027లో ఉంటుంది. ఇది పూర్తిగా డిజిటల్గా.. మొబైల్ యాప్ ద్వారా ఉంటుందని AP జనగణన డైరెక్టర్ జె. నివాస్ ప్రకటించారు.
1. se.census.gov.inకి వెళ్లండి.
2. మొబైల్ నంబర్తో లాగిన్ అవ్వండి.
3. ఇంటి వివరాలు, కుటుంబ సమాచారం, సౌకర్యాలు నింపండి. ఇది 15-20 నిమిషాల్లో పూర్తవుతుంది.
4. ఓటీపీ ధృవీకరణ తర్వాత సబ్మిట్ చెయ్యండి.
ఇలా చేస్తే అధికారి మన వచ్చినప్పుడు సమయం తక్కువ పడుతుంది. మీ డేటాని మీరే సరిగ్గా ఇచ్చినట్లవుతుంది. ఉదాహరణగా చూస్తే.. ఒక చిన్న గ్రామంలో ఇంటర్నెట్ సౌకర్యం తప్పుగా చెప్పితే ఆ గ్రామానికి డిజిటల్ ఇండియా పథకాలు ఆలస్యమవుతాయి. సరైన డేటా ఇచ్చి సహకరిస్తే మన పిల్లల భవిష్యత్తు మెరుగుపడుతుంది.
33 ప్రశ్నలు వేస్తారు. ఇంటి రకం, మట్టిదా, పక్కా గృహమా, విద్యుత్, నీరు, LPG, ఇంటర్నెట్, వాహనాలు, ఆస్తులు మొదలైనవి అడుగుతారు. డాక్యుమెంట్లు ఇవ్వాల్సిన, చూపించాల్సిన అవసరం లేదు. నమ్మకం ఆధారంగా సమాధానాలు ఇస్తే సరిపోతుంది.


