గాజువాక మౌనిక మర్డర్ కేసులో రోజుకో మలుపు తిరుగుతున్న నేపథ్యంలో పూర్తి నిజాలు వెలుగులోకి తీసుకురావాలని బుధవారం కలెక్టరెట్ దగ్గర నిరసన తెలిపారు. ఈ నిరసనలో డి. లలిత వెంకటలక్ష్మి, కొత్తపల్లి వెంకటరమణ, కె.చిన్నారావు, చింతాడ సూర్యం, సయ్యద్, సారయ్య పాల్గొన్నారు. మరి ఈకేసులో నిందితుడికి ఎలాంటి శిక్ష విధిస్తారు.. మృతురాలి కుటుంబానికి ఎలాంటి న్యాయం చేస్తారనే సందిగ్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది.



