Visakhapatnam: వైజాగ్ వాసులకు పవర్ కట్ అలర్ట్.. నేడు పలు ప్రాంతాల్లో విద్యుత్ నిలిపివేత.. పూర్తి వివరాలు ఇవే! | ఆంధ్రప్రదేశ్ వార్తలు


Last Updated:

వేసవి ఎండలు పెరుగుతున్న తరుణంలో, విద్యుత్ లైన్లకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించడం మరియు ఫీడర్ల సామర్థ్యాన్ని పెంచే పనులను చేపట్టడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు జోన్-3 ఈఈ బి. సింహాచలం నాయుడు ఒక ప్రకటనలో వెల్లడించారు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

Visakhapatnam: విశాఖపట్నం నగరంలోని పలు సబ్ స్టేషన్ల పరిధిలో అత్యవసర మరమ్మతులు, లైన్ల నిర్వహణ పనుల కారణంగా సోమవారం విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు ఏపీఈపీడీసీఎల్ (APEPDCL) అధికారులు ప్రకటించారు. వేసవి ఎండలు పెరుగుతున్న తరుణంలో, విద్యుత్ లైన్లకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించడం మరియు ఫీడర్ల సామర్థ్యాన్ని పెంచే పనులను చేపట్టడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు జోన్-3 ఈఈ బి. సింహాచలం నాయుడు ఒక ప్రకటనలో వెల్లడించారు.

చినముషిడివాడ, పరిసర ప్రాంతాలు

11 కేవీ చినముషిడివాడ ఫీడర్ పరిధిలో మరమ్మత్తు పనులు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు చినముషిడివాడ పాత గ్రామం, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పరిసరాలు, ఎస్సీ, బీసీ కాలనీలు, నాగేంద్ర నగర్, చిన్నయ్య కాలనీ, సాయినగర్, అశోక్ నగర్, ద్రోణంరాజు నగర్, శారదాపీఠం పరిసర ప్రాంతాల్లో విద్యుత్ ఉండదు

కొమ్మాది, పరదేశీపాలెం జోన్

పరదేశీపాలెం, మారికవలస ఉప విద్యుత్తు కేంద్రాల పరిధిలోని పలు ఫీడర్లలో చెట్ల కొమ్మల తొలగింపు పనులు నిర్వహించనున్నారు. దీనివల్ల ఉదయం 9 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు పాత, కొత్త పరదేశీపాలెం, ఈడబ్ల్యూఎస్ (EWS) కాలనీ, డంపింగ్ యార్డు ఇండస్ట్రీస్ ప్రాంతం, చిలుకూరు లేఅవుట్, దాని చుట్టుపక్కల కాలనీల్లో విద్యుత్ ఉండదు.

అడవివరం (సింహాచలం) ప్రాంతం

33/11 కేవీ ఎస్వీఎల్ ఎన్ఎస్ఎస్ ఉప కేంద్రం పరిధిలోని 11 కేవీ పుష్కరిణి ఫీడర్‌పై నిర్వహణ పనులు జరగనున్నాయి. ఈ కారణంగా ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పోస్టాఫీసు వీధి, విజినిగిరి పాలెం, పాత అడవివరం,

స్వామి కళ్యాణ మండపం పరిసర ప్రాంతాల్లో విద్యుత్ ఉండదు.

అధికారుల విజ్ఞప్తి

వేసవి కాలంలో విద్యుత్ డిమాండ్ ఎక్కువగా ఉన్నందున, ఎటువంటి అంతరాయాలు లేకుండా నిరంతర సరఫరా అందించడమే లక్ష్యంగా ఈ ముందస్తు నిర్వహణ పనులు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. మరమ్మతులు నిర్ణీత సమయం కంటే ముందే పూర్తయితే సరఫరాను త్వరగానే పునరుద్ధరిస్తామని పేర్కొన్నారు. ప్రజలు ఈ అసౌకర్యానికి సహకరించాలని మరియు మధ్యాహ్న సమయాల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని కోరారు.

ముఖ్యంగా విద్యుత్ లేని సమయంలో నీటి మోటార్లు వేయడం కుదరదు కాబట్టి, ఉదయమే అవసరమైన నీటిని నిల్వ చేసుకోవాలని గృహిణులకు సూచించారు. ఎలక్ట్రానిక్ పరికరాలను జాగ్రత్తగా ఉంచుకోవాలని, పవర్ పునరుద్ధరణ సమయంలో వోల్టేజ్ హెచ్చుతగ్గులు ఉండే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *