Last Updated: Mar 22, 2026, 21:05 IST
చిత్తూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. నాలుగు రోజుల సెలవులు రావడంతో తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఉదయం నుంచే ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడుతూ ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది.స్వామివారి సర్వదర్శనం కోసం భక్తులు దీర్ఘ క్యూలలో నిలబడగా, దర్శనానికి సుమారు మూడు గంటల సమయం పడుతోంది. అయినప్పటికీ, భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో క్రమశిక్షణగా ముందుకు సాగుతూ స్వామివారి దర్శనం కోసం ఆసక్తిగా వేచి చూస్తున్నారు.
#Kanipakam #GaneshTemple #TempleRush


