Srisailam Ugadi Festival 2026: శివయ్యను చూసేందుకు కన్నప్పల పాదయాత్ర.. ఒక్క రోజే లక్ష మంది దర్శనం |


Last Updated:

Srisailam Ugadi Festival 2026: శ్రీశైల మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాలు అంబరాన్నంటుతున్నాయి. పొరుగు రాష్ట్రమైన కర్ణాటక నుండి కన్నడ భక్తులు పాదయాత్రగా, వాహనాల్లో భారీ సంఖ్యలో తరలివస్తున్నారు.

+

Srisailam

Srisailam Ugadi Festival 2026

Srisailam Ugadi Festival 2026: ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైల మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాలు అంబరాన్నంటుతున్నాయి. పండుగ వేళ తమ ఆడపడుచు భ్రమరాంబికా దేవిని దర్శించుకునేందుకు పొరుగు రాష్ట్రమైన కర్ణాటక నుండి కన్నడ భక్తులు పాదయాత్రగా, వాహనాల్లో భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. దీంతో శ్రీగిరి కన్నడ జయజయధ్వానాలతో మార్మోగుతోంది.

2 రోజు భక్తుల రద్దీ..

శ్రీశైలంలో ఐదు రోజుల పాటు జరిగే ఉగాది మహోత్సవాలు రెండో రోజుకు చేరుకున్నాయి. నేడు (రెండో రోజు) సాయంత్రం భ్రమరాంబికా దేవి అమ్మవారు మహాదుర్గ అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. అనంతరం స్వామి అమ్మవార్లు కైలాస వాహనంపై ఆశీనులై భక్తులకు దర్శనమిస్తారు. రాత్రి వేళ ఆదిదంపతుల గ్రామోత్సవం క్షేత్రపురవీధుల్లో కనులపండువగా జరగనుంది.

లక్ష మంది వరకు కన్నప్పలు..

కన్నడ భక్తుల రాకతో శ్రీశైలం జనసముద్రాన్ని తలపిస్తోంది. దేవస్థానం ఈవో శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం.. నిన్న ఒక్కరోజే సుమారు 96,000 మంది కన్నడ భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు వేకువజామున 4:30 గంటల నుండే భక్తులను క్యూలైన్లలోకి అనుమతిస్తున్నారు.

ప్రత్యేక ఏర్పాట్లు..

భక్తులందరికీ సంతృప్తికరమైన దర్శనం కల్పించేందుకు ఆలయ యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది:

అలంకార దర్శనం మాత్రమే: రద్దీ దృష్ట్యా స్వామివారి స్పర్శ దర్శనాన్ని పూర్తిగా నిలిపివేశారు. భక్తులందరికీ కేవలం అలంకార దర్శనానికి మాత్రమే అనుమతి ఇస్తున్నారు.

వేచి ఉండే సమయం: ప్రస్తుతం స్వామి అమ్మవార్ల దర్శనానికి సుమారు 4 గంటల సమయం పడుతోంది.

సౌకర్యాలు: క్యూ కాంప్లెక్స్‌లో వేచి ఉండే భక్తులకు అసౌకర్యం కలగకుండా నిరంతరాయంగా అల్పాహారం, బిస్కెట్లు, మంచినీరు, మజ్జిగ పంపిణీ చేస్తున్నారు.

ప్రసాదాల విక్రయం: భక్తుల అవసరాలకు తగ్గట్టుగా తగినన్ని లడ్డూ ప్రసాదాలను సిద్ధం చేసి, ప్రత్యేక కౌంటర్ల ద్వారా విక్రయిస్తున్నారు.

మరో మూడ్రోజులు పండగే..

ఉగాది పర్వదినం సందర్భంగా శ్రీశైలం క్షేత్రం ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతోంది. ముఖ్యంగా కర్ణాటక, మహారాష్ట్రల నుండి వచ్చే భక్తులతో ఆలయ పరిసరాలు, క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దేవస్థానం సిబ్బంది ప్రత్యేక విధుల్లో నిమగ్నమయ్యారు.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *