ఎండలు క్రమంగా పెరుగుతున్న వేళ చాలా మంది చల్లని ప్రదేశాల కోసం వెతుకుతున్నారు. ముఖ్యంగా గోదావరి జిల్లాల ప్రజలు ప్రకృతి మధ్యలో కాసేపు విశ్రాంతి తీసుకోవాలని భావిస్తే ఒక అద్భుతమైన ప్రదేశం ఉంది. పచ్చని అడవి మధ్యలో భారీ డ్యాం నీటి నిల్వలు, కొండలపై నుంచి జాలువారే జలపాతం, ఆధ్యాత్మిక స్పర్శ కలిగిన ఆలయం ఇలా అన్నీ కలిసిన ప్రదేశంగా ఈ ప్రాంతం పర్యాటకులను, భక్తులను ఒకేసారి ఆకట్టుకుంటోంది. ప్రకృతి సోయగాలు, ప్రశాంత వాతావరణం కలిసి ఒక ప్రత్యేకమైన అనుభూతిని కలిగిస్తాయి.



