దీని ప్రభావంతో ఇవాళ(మార్చి 9) ఉత్తరాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో ప్రత్యేకించి శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, పోలవరం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్టణం జిల్లాల్లో చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయని వివరించింది. అయితే అక్కడ ఒకవైపు ఎండలు, మరోవైపు తేలికపాటి వానలు దంచికొట్టనున్నాయి. దీంతో ప్రజలు కాస్త చల్లదనంతో ఊపిరిపీల్చుకోనున్నారు.



