తెలంగాణ టూరిజం ఆపరేట్ చేస్తున్న హైదరాబాద్ – వైజాగ్ – అరకు టూర్ ప్యాకేజీలో పెద్దలకు ఒక్కొక్కరికి రూ.7,500గా నిర్ణయించారు. అదే, 5 నుంచి 12 ఏళ్ల చిన్నారులకు రూ.600 చెల్లించాలి. ఈ జర్నీ మొత్తం నాన్ ఏసీ వెహికల్ లోనే ఉంటుంది. అక్కడికి చేరుకున్న తర్వాత విశాఖపట్టణంలో ఏసీ హోటల్లోనూ, అరకులో నాన్ ఏసీ హోటల్లోనూ స్టే కల్పిస్తారు. వైజాగ్, అరకు సైట్ సీయింగ్, గైడ్ ఛార్జీలు కూడా కవర్ చేయవచ్చు. ఫుడ్, ఎంట్రీ టికెట్స్, బోటింగ్ ఛార్జీలు, దర్శనం టికెట్లు, లాండ్రీ ఛార్జీలు వంటివి మాత్రం టూర్ ప్యాకేజీలో ఉండవనే విషయం గుర్తించాలి. వీటిని ప్రయాణికులే చెల్లించుకోవాలి.



