మమతా బెనర్జీకి గట్టి ఎదురుదెబ్బ.. టీఎంసీకి మూడో రాజ్యసభ సభ్యుడి రాజీనామా


పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)కి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాలు ఇప్పుడు బహిరంగంగా కనిపిస్తుండగా,కీలక నేతలు ఒక్కొక్కరుగా పార్టీకి దూరమవుతున్నారు. తాజాగా టీఎంసీకి చెందిన రాజ్యసభ సభ్యుడు ప్రకాష్ చిక్ బరాయిక్ తన సభ్యత్వానికి రాజీనామా చేయడంతో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
టీఎంసీకి రాజ్యసభలో ఇది వరుసగా మూడో పెద్ద షాక్ కావడం గమనార్హం. ఇప్పటికే సీనియర్ నేతలు సుఖేందు శేఖర్ రాయ్, సుస్మితా దేవ్ తమ రాజ్యసభ సభ్యత్వాలకు రాజీనామా చేయగా, ఇప్పుడు ప్రకాష్ చిక్ బరాయిక్ కూడా అదే బాట పట్టారు. వరుసగా ముగ్గురు కీలక నేతలు ఎగువ సభకు వీడ్కోలు పలకడంతో రాజ్యసభలో టీఎంసీ బలం గణనీయంగా తగ్గిపోయింది.

టీఎంసీకి చెందిన మరో ముగ్గురు రాజ్యసభ సభ్యులు కూడా రాజీనామా చేసే అవకాశం
తాజా పరిణామంతో మమతా బెనర్జీ నేతృత్వంలోని పార్టీకి రాజ్యసభలో కేవలం 10 మంది సభ్యులే మిగిలారు. ఇదిలా ఉంటే, టీఎంసీకి రానున్న రోజుల్లో మరిన్ని రాజకీయ ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పార్టీలో నెలకొన్న అసమ్మతి ఇంకా చల్లారలేదని, దాని ప్రభావం మరిన్ని రాజీనామాల రూపంలో కనిపించే అవకాశం ఉందని చెబుతున్నారు.
విశ్వసనీయ సమాచారం ప్రకారం, వచ్చే వారం రోజుల్లో టీఎంసీకి చెందిన మరో ముగ్గురు రాజ్యసభ సభ్యులు కూడా తమ పదవులకు రాజీనామా చేసే అవకాశమున్నట్లు ప్రచారం జరుగుతోంది.

టీఎంసీలో పెరుగుతున్న అంతర్గత విభేదాలు
ఒకవేళ ఈ ప్రచారం నిజమైతే, పార్లమెంట్‌లో టీఎంసీ బలం మరింత తగ్గిపోవడంతో పాటు మమతా బెనర్జీ నాయకత్వానికి కూడా పెద్ద సవాలుగా మారే పరిస్థితి నెలకొనవచ్చు.అయితే, తాజా రాజీనామాల వెనుక అసలు కారణాలపై ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి స్పష్టత రాలేదు.మరోవైపు, ప్రతిపక్షాలు మాత్రం ఈ పరిణామాలను టీఎంసీలో పెరుగుతున్న అంతర్గత విభేదాలు, నాయకత్వంపై అసంతృప్తికి నిదర్శనంగా పేర్కొంటున్నాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *