Headlines

Mobile Recovery Mela | మీ ఫోన్ పోయిందా? ఈ నంబర్కి మెసేజ్ చేయండి..

తిరుపతి జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన మొబైల్ రికవరీ మేళా ప్రజల్లో విశేష స్పందనను రేకెత్తించింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వినియోగిస్తూ పోలీసులు మరోసారి తమ పనితీరును నిరూపించారు. 14వ దశ మొబైల్ రికవరీ కార్యక్రమంలో భాగంగా సుమారు రూ.1 కోటి విలువైన 500 మొబైల్ ఫోన్లను గుర్తించి అసలు యజమానులకు తిరిగి అందజేశారు. CEIR (సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్) పోర్టల్ సహకారంతో ఈ ఫోన్లను ట్రాక్ చేసి రికవరీ చేయడం జరిగింది. తమ విలువైన…

Read More

డీకే కు సీఎం గా అవకాశం ఇవ్వండి

– హై కమాండ్ ను కోరిన 80 మంది ఎమ్మెల్యేలు బెంగళూరు : కర్ణాటక రాజకీయాలు ఊహించినట్లుగానే మలుపులు తిరుగుతున్నాయి. సీఎం పోస్టుపై అనేక ఊహగానాలు ఎప్పటికప్పుడు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా.. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ను సీఎం గా చేయమని 80 మంది ఎమ్మెల్యేలు హై కమాండ్ ను అభ్యర్థించారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే ఇక్బాల్ హుస్సేన్ వెల్లడించడంతో మరొకసారి చర్చనీయాసంగా మారింది. జాతీయ మీడియా కథనాల ప్రకారం.. సీఎం పదవి విషయంలో డీకే కు…

Read More

అవునండీ…ఆ నగరం కుంగిపోతోంది

మెక్సికో: పట్టణీకరణతో జనాభా పెరుగుదల, ఇతరత్రా సమస్యలే కాదు…భౌగోళిక సమస్యలూ తలెత్తుతున్నాయి. పర్యావరణాన్ని లెక్క చేయకుండా విస్తరిస్తోన్న నగరాలు పెద్ద సమస్యలే తెచ్చిపెడుతున్నాయి. సరైన ప్రణాళిక లేని నగర విస్తరణ వల్ల కలిగే విపరిణామాలకు ‘మెక్సికో’ నగరం నిదర్శనగా నిలిచింది. మెక్సికో రాజధాని అయిన మెక్సికో సిటీ అసాధారణ స్థాయిలో కుంగుతోంది. రోదసి నుంచి కూడా ఈ పరిణామ తీవ్రత కనిపించింది. భూకక్ష్యలో పరిభ్రమిస్తోన్న భారత్, అమెరికా సంయుక్త ఉపగ్రహం ‘నైసార’ దీన్ని పసిగట్టింది. ఈ నగరం…

Read More

అజేయం…అజరామరం

దేశం గర్వించేలా రాజధాని నిర్మాణం . భూములిచ్చిన రైతులకు పాదాభివందనం. అమరావతిపై జగన్ ఊసరవెల్లి రాజకీయం. అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు విశాలాంధ్ర-సచివాలయం: అమరావతి అజేయం… అద్భుతం… అజరామరమని, అమరావతితోనే తెలుగు వైభవమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. శాశ్వత రాజధానిగా అమరావతికి చట్ట బద్ధత కల్పించాలని కేంద్రాన్ని కోరుతూ శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో శనివారం తీర్మానం ప్రవేశపెట్టారు. తీర్మానానికి మద్దతు పలికిన శాసనసభ్యులందరికీ ధన్యవాదాలు తెలిపారు. రాజధానిని ఇక ఎవరూ అంగుళం కూడా కదిలించలేరన్నారు….

Read More

పీసీపీఎన్డీటీ చట్ట ఉల్లంఘనలపై టోల్ ఫ్రీ నంబర్ హెల్ప్ నంబర్

1800 233 2447 ఏర్పాటు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి,డాక్టర్ ఈ .బి దేవివిశాలాంధ్ర అనంతపురం టౌన్ : గర్భంలో శిశువు లింగ నిర్ధారణ చట్ట విరుద్ధ కార్యకలాపాలను అరికట్టేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందని అందులో భాగంగా టోల్ ఫ్రీ నంబర్ హెల్ప్ నంబర్ 1800 233 2447 ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ ఈ బి దేవి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ…

Read More

తెలుగు రాష్ట్రంలో వాతావరణ మార్పులు.. ఎక్కడెక్కడ వర్షాలు పడతాయో తెలుసా..? 3 days of rains and lightning in AP and Telangana says weather department. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 25, 2026 10:12 PM IST ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మూడు రోజుల పాటు మేఘావృత వాతావరణం పిడుగులతో తేలికపాటి మోస్తరు వర్షాలు విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరిక ప్రజలు రైతులు అప్రమత్తంగా ఉండాలి + రాష్ట్రంలో మరో మూడు రోజులు మేఘావృతమైన వాతావరణంతో పాటుగా పిడుగులతో కూడిన వర్షాలు. రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటు వాతావరణం ఒక్కసారిగా మారనుంది. మేఘావృతమైన ఆకాశంతో పాటు పిడుగులు, ఉరుములతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు…

Read More

ఎడారిని పంట భూమిగా మార్చిన చైనా

టి. లక్ష్మీనారాయణ ఇటీవల నేను చదివిన అనంతపురం అర్ధ-శుష్క ప్రాంతాలలో భూ క్షీణత, ఇసుక వలసలు, ఎడారీకరణపై శాస్త్రవేత్తల పరిశోధన పత్రం నాకు తీవ్ర ఆందోళన కలిగించింది. బొమ్మనహాల్, బెళుగుప్ప, కణేకల్ మండలాలలో నేల క్షీణత, ఇసుక ఆక్రమణ, హగరి (వేదవతి) నది ఎండిపోవడం వంటి పరిస్థితులు భవిష్యత్తులో వ్యవసాయానికి ముప్పుగా మారవచ్చని పరిశోధకులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఎడారులను సైతం వ్యవసాయ భూములుగా మార్చిన చైనా అనుభవం మన ఆలోచనలకు పదునుపెట్టాలి. 1990 ఏప్రిల్ 3-9…

Read More

పోలవరం పూర్తికినిధులివ్వండి

. విభజనాంశాలు, పెండింగ్ ప్రాజెక్టులు అమలు చేయండి. కేంద్రానికి చంద్రబాబు విజ్ఞప్తి. కేంద్ర మంత్రులు అమిత్ షా, పాటిల్‌తో సీఎం భేటీ. ఆల్మట్టి ఎత్తు పెంచితే ఏపీ ప్రయోజనాలకు విఘాతమని వెల్లడి విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వివిధ కేంద్ర ప్రాయోజిత పథకాలతో పాటు గతంలో హామీ ఇచ్చిన మేరకు నిధులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దిల్లీ పర్యటనలో భాగంగా సోమవారం ఉదయం కేంద్ర హోం…

Read More

ఆర్థిక అసమానతలు తగ్గాలి – Visalaandhra

. అప్ప్పుడే నిజమైన ప్రజాస్వామ్య ఫలాలు: సీఎం చంద్రబాబు. పుట్టినరోజున అన్నక్యాంటిన్‌లో స్వయంగా వడ్డించిన సీఎం దంపతులు విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: సమాజంలో ఆర్థిక అసమానతలు తగ్గినప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం ఫలాలు దక్కినట్లవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అన్నదానం అన్నిటికంటే పవిత్రమైందని, ఇందులో ఎవరికి తోచిన విధంగా వారు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. తన పుట్టిన రోజు సంద ర్భంగా ముఖ్యమంత్రి విజయవాడలోని పటమట అన్నక్యాంటీన్‌కు ఆయన సతీమణి భువనేశ్వరితో కలిసి వెళ్లారు. క్యాంటీన్‌కు…

Read More

Vadapalli Venkanna Swamy Temple | రికార్డు స్థాయిలో వాడపల్లి వెంకన్న హుండీ ఆదాయం | #local18V

ఏపీలో మరోతిరుపతిగా పేరుగాంచిన కోనసీమ వాడపల్లి చందన రూపుడైన వెంకటేశ్వరస్వామికి రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరింది, గత 27 రోజులకు గాను 1 కోటి 80 లక్షలకు పైగా ఆదాయం సమకూర్నట్లుగా దేవస్థానం అధికారులు వెల్లడించారు, నిజానికి మహాలక్ష్మిదేవి స్వామి వారికి సిరులు కురిపిస్తుంది అన్నవిధంగా వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి ఆదాయం ప్రతి మాసానికి పెరిగిపోతూ వస్తుందని చెప్పుకోవచ్చు. తాజాగా ఆదాయ వివరాలు, బంగారం, వెండి, వివరాలు ఏవిధంగా ఉన్నాయి భక్తులు ఏమంటున్నారు ఒకసారి క్లుప్తంగా చూద్దాం…

Read More