రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు – Visalaandhra
విశాలాంధ్ర – సచివాలయం: రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల నిర్వహణకు విద్యామండలి అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఈ నెల 23 నుంచి ప్రారంభం కానున్న పరీక్షల కోసం1,537 కేంద్రాలను సిద్ధం చేసినట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి రంజిత్ భాషా శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని, క్రమశిక్షణతో కూడిన ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. 2025-26 విద్యా సంవత్సరానికి ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు కలిపి 10,57,312 మంది…


