ఎల్లుండి నుంచి తెలంగాణ ఇంటర్ పరీక్షలు… బోర్డు సెక్రటరీ కీలక సూచనలు

ఈ నెల 25 నుంచి మార్చి 18 వరకు ఇంటర్ పరీక్షలు తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షలకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 25 నుంచి మార్చి 18 వరకు జరగనున్న ఈ పరీక్షల నిర్వహణపై ఇంటర్ బోర్డు సెక్రటరీ, ఐఏఎస్ అధికారి కృష్ణాదిత్య కీలక వివరాలను వెల్లడించారు. ఈ ఏడాది మొత్తం 9,97,075 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాబోతున్నారు. ఇందులో మొదటి సంవత్సరం నుంచి 4,89,126 మంది, ద్వితీయ సంవత్సరం నుంచి 5,07,949 మంది విద్యార్థులు పరీక్షలు…

Read More

తేజస్‌కు మళ్లీ ప్రమాదం.. ఐఏఎఫ్ షాకింగ్ నిర్ణయం!

భారత వైమానిక దళం సంచలన నిర్ణయం తీసుకుంది. వరుస ప్రమాదాల నేపథ్యంలో తమ వద్ద ఉన్న సుమారు 30 సింగిల్ సీట్ తేజస్ యుద్ధవిమానాలను తాత్కాలికంగా నిలిపివేసింది.ఈ నెల ప్రారంభంలో ఓ కీలక ఎయిర్ బేస్‌లో సాధారణ శిక్షణ ఫ్లైట్ ముగించుకుని ల్యాండింగ్ సమయంలో Indian Air Force కు చెందిన HAL Tejas లైట్ కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ మరోసారి ప్రమాదానికి గురైంది.ప్రాథమిక సమాచారం ప్రకారం సాంకేతిక లోపమే కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు.ముఖ్యంగా ఆన్‌బోర్డ్ సిస్టమ్ ఫెయిల్యూర్…

Read More

డ్రగ్ మాఫియా డాన్ ఎల్ మెంచో మృతి.. మెక్సికోలో భారతీయులకు అడ్వైజరీ

మోస్ట్‌ వాంటెడ్‌ డ్రగ్ మాఫియా నాయకుడు నెమెసియో ఒసెగుయెరా, ఎల్ మెంచోగా ప్రఖ్యాతి పొందిన వ్యక్తి, మృతి చెందినట్లు మెక్సికో సైన్యం ప్రకటించింది.ఆదివారం నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్‌లో అతడు ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు వెల్లడించారు. ఈ పరిణామంతో దేశవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.59 సంవత్సరాల వయస్సున్న ఎల్ మెంచోను అరెస్ట్ చేయాలనే లక్ష్యంతో మెక్సికో సైన్యం ప్రత్యేక చర్యలు ప్రారంభించింది.అమెరికా గూఢచారి విభాగాల నుంచి అందిన సమాచారంతో జాలిస్కో రాష్ట్రంలోని తపాల్ప పట్టణంలో అతడు దాగి ఉన్న…

Read More

ఏపీలో ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు.. – Visalaandhra

మొదటి రోజు ఫస్టియర్ విద్యార్థులకు పరీక్షలు మొత్తం 10.57 లక్షల మంది విద్యార్థుల హాజరుపరీక్ష కేంద్రాల వద్ద పటిష్ఠ బందోబస్తు.. 144 సెక్షన్ అమలు రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటలకు మొదటి సంవత్సరం విద్యార్థులకు పరీక్ష మొదలైంది. నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని ఇంటర్ బోర్డు ముందుగానే స్పష్టం చేయడంతో విద్యార్థులు గంట ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. ఈ పరీక్షలు మధ్యాహ్నం 12 గంటల వరకు కొనసాగుతాయి. ఈ ఏడాది ఇంటర్ మొదటి…

Read More

బడ్జెట్ సెషనా…లడ్డ్డూ సెషనా?

అసెంబ్లీ సమావేశాలపై రామకృష్ణ ప్రశ్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ, శాసనమండలి సమావేశాల్లో జరుగుతున్నవి బడ్జెట్ చర్చలా లేక లడ్డూ వివాదానికి సంబంధించిన చర్చలా అనేది అర్థం కావటం లేదని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ శనివారం ఒక ప్రకటనలో తీవ్రంగా విమర్శించారు. విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ, శాసనమండలి సమావేశాల్లో జరుగుతున్నవి బడ్జెట్ చర్చలా లేక లడ్డూ వివాదానికి సంబంధించిన చర్చలా అనేది అర్థం కావటం లేదని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ…

Read More

ఆదాయం పెంచి ఆనందం పంచుతాం

. పేదలకు సంక్షేమంలో దేశంలో ఏపీయే టాప్. మార్చి నెలాఖరుకు అన్ని పంచాయతీల్లో 100 శాతం చెత్త సేకరణ. కల్తీ అక్రమాల నుంచి తప్పించుకోవడానికే హెరిటేజ్‌పై నిందలు. వినుకొండ స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో సీఎం చంద్రబాబు విశాలాంధ్ర`వినుకొండ : పేద ప్రజల ఆదాయాన్ని పెంచి, ప్రతి ఒక్కరికి ఆనందం పంచేలా కృషి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రజలకు ఆదాయం పెంచే మార్గాన్ని నేర్పించి వారిని అభివృద్ధి చేయడమే లక్ష్యమని స్పష్టం చేశారు. పల్నాడు జిల్లా వినుకొండలో…

Read More

ప్రజా సమస్యలు ‘గోవిందా’ – Visalaandhra

లడ్డూ పైనే గొడవలు. భక్తికి, రాజకీయానికి మధ్య నలుగుతున్న సామాన్యుడు. ఏపీలో ముదురుతున్న దైవ రాజకీయం విశాలాంధ్రసచివాలయం : ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ యవనికపై ప్రస్తుతం ఒక వింత పరిస్థితి నెలకొంది. సామాన్యుడి ఆకలి కేకలు, పెరిగిన ధరలు, నిరుద్యోగం వంటి ‘నిజమైన’ సమస్యలు పక్కకు వెళ్లిపోయాయి. ఇప్ప్పుడు రాష్ట్రమంతా ‘నెయ్యికొవ్వు`క్షమాపణలు’ అనే మూడింటి చుట్టూనే తిరుగుతోంది. భక్తిని అడ్డం పెట్టుకుని ఈ ‘ప్రాయశ్చిత్త’ రాజకీయాలు సాగుతున్నాయి. ఏపీ రాజకీయాల్లో గత మూడు దశాబ్దాల్లో ఎన్నడూ లేనంతగా…

Read More

వామపక్ష సాహిత్యంప్రపంచానికి అవసరం – Visalaandhra

. సామ్రాజ్యవాదం అభివృద్ధి నిరోధకం. కమ్యూనిస్టులు లేరనే వారికి భవిష్యత్తే సమాధానం. రెడ్‌బుక్ డే సభలో వక్తలు విశాలాంధ్ర-విజయవాడ:సామ్రాజ్యవాద దోపిడీదారుల నియంతత్వ పోకడలను అడ్డుకునేందుకు వామపక్ష సాహిత్యం ప్రపంచానికి అత్యవసరమని వక్తలు స్పష్టంచేశారు. విజయవాడలోని లెనిన్ విగ్రహం వద్ద విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, ప్రజాశక్తి బుక్ హౌస్ సంయుక్త అధ్వర్యంలో రెడ్‌బుక్ డే కార్యక్రమాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. తొలుత ప్రజానాట్యమండలి కళాకారులు ఆలపించిన విప్లవ గేయాలు వీక్షకులను ఆలోచింపజేశాయి. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య,…

Read More

ఉగ్రముప్ప్పు – అప్రమత్తం

హైదరాబాద్ చంచల్‌గూడ జైలులో కుట్రదేశవ్యాప్త దాడులకు లష్కరే తోయిబా ప్రణాళికనిఘా వర్గాల హెచ్చరిక ఉగ్రవాదులు ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ (ఐఈడీ) దాడికి కుట్ర పన్నుతున్నట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. దేశరాజధాని దిల్లీ, హైదరాబాద్‌లో పేలుళ్లకు కుట్ర చేసినట్లు వెల్లడించాయి. హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైలు ములాఖత్‌లో ఉగ్రకుట్రకు పథక రచన జరిగినట్లు తెలుస్తోంది. జైలు నుంచే నగరంలో విధ్వంసానికి కుట్ర పన్నినట్లు నిఘావర్గాలు అనుమానిస్తున్నాయి. న్యూదిల్లీ/హైదరాబాద్: పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా భారతదేశంపై మరో కుట్రకు…

Read More

లంచం తీసుకుంటూబీజేపీ ఎమ్మెల్యే అరెస్టు – Visalaandhra

బెంగళూరు: ఓ కాంట్రాక్టర్ నుంచి రూ.10 లక్షలు లంచం తీసుకుంటూ కర్నాటకకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే చంద్రూ లమానీ పోలీసులకు పట్టుబడ్డారు. ఎమ్మెల్యేతో పాటు ఆయన ఇద్దరు పీఏలనూ అదుపులోకి తీసుకున్నారు. మైనర్ ఇరిగేషన్ శాఖకు సంబంధించిన రోడ్డు పక్కన రిటెయినింగ్ వాల్ నిర్మాణ పనుల కేటాయింపు కోసం ఎమ్మెల్యే… క్లాస్-1 కాంట్రాక్టర్ విజయ్‌పూజార్ నుంచి రూ.10 లక్షలు డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా లక్ష్మీశ్వర పట్టణంలో మొదటి విడతగా రూ.5 లక్షలు తీసుకుంటుండగా ధార్వాడ్ పరారయ్యారు….

Read More