అటవీ, అభయారణ్య ప్రాంతాలలో మౌలిక సదుపాయాలపై నివేదిక సమర్పించండి

జిల్లా కలెక్టర్ కె. వెట్రి సెల్వి విశాలాంధ్ర ఏలూరు: జిల్లాలోని రిజర్వ్ అటవీ ప్రాంతాలు, అభయారణ్య ప్రాంతాలలో నివసించే ప్రజలకు అవసరమైన త్రాగునీరు బోర్లు,పైపులైన్లు, ,రోడ్లు వంటి కనీస సౌకర్యాలు ఏర్పాటుచేసేందుకు అవకాశాలను పరిశీలించి నివేదికలను వెంటనే సమర్పించాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ లోని గౌతమీ సమావేశపు హాలులో సోమవారం జిల్లాలోని రిజర్వ్ అటవీ ప్రాంతాలు, అభయారణ్య ప్రాంతాలలో ప్రజలకు ప్రాథమిక సౌకర్యాల కల్పనపై జాయింట్ కలెక్టర్ డా.ఎం.జె. అభిషేక్…

Read More

అమరజీవి పొట్టి శ్రీరాములు జీవితం స్ఫూర్తిదాయకం

జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ విశాలాంధ్ర – ఏలూరు : జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో సోమవారం అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ మాట్లాడుతూ ఆంధ్రరాష్ట్ర సాధన కోసం పొట్టిశ్రీరాములు చేసిన త్యాగం చరిత్రలో చిరస్మరణీయమని తెలిపారు. తెలుగువారికి ప్రత్యేక…

Read More

అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగం చిరస్మరణీయం ఎమ్మెల్యే కందికుంట

విశాలాంధ్ర,కదిరి..అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగం చిరస్మరణీయమని ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ తెలిపారు. సోమవారం స్థానిక టవర్ క్లాక్ వద్దనున్న పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్బంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రం కోసం 58 రోజుల దీక్ష చేసి ప్రాణ త్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు చరిత్ర భావితరాలకు అందించడం మన బాధ్యత అన్నారు. భవిష్యత్తులో మహనీయుల చరిత్రను దేశమంతా స్మరించుకునేలా పెద్ద ఎత్తున సేవా…

Read More

వచన రచనా మార్గదర్శి చిన్నయ సూరి

సుమారు 180 సంవత్సరాల క్రితం నాటి మాట. అది 1847వ సంవత్సరం. ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలనా రోజులు.మద్రాసులోని’ సెయింట్ జార్జ’ కోటలో ఏర్పరచిన కళాశాలలో ఇంగ్లీషు వారికి తెలుగు పాఠాలు నేర్పించడానికి ‘ట్యూటర’ ఉద్యోగంలో ఒక తెలుగు పండితుణ్ణి నియమించేవారు. అప్పటివరకు ట్యూటర్ గా ఉన్న పుదూరి సీతారామశాస్త్రి ‘రిటైర’ అయిపోయారు. ఆ తర్వాత ఆ ఉద్యోగానికి కేవలం తెలుగు చదివిన వాడే కాకుండా, కొంత ఇంగ్లీష్ కూడా వచ్చిన వాళ్ల కోసం ఒక ప్రకటన…

Read More

కవిత్వ పొలం గట్లమీదతెలుగు కవి బండ్ల మాధవరావు

రాచపాళెం చంద్రశేఖరరెడ్డిసెల్: 9440222117నాగలంటేమట్టిని చీల్చిఅన్నంముద్దను దోసిలిలో పెట్టేది కదా! (పు43) నూటపాతికేళ్ల ఆధునిక తెలుగు కవిత్వం ఎప్ప్పుడైనా పలచబడి ఉండవచ్చుగానీ, వ్యాపారాత్మకం మాత్రం కాలేదు. కథానికలు, నవలల్లో మనం వ్యాపార ధోరణిని ఇదివరకే గుర్తించాం. కవిత్వం మీద ఆ ఫిర్యాదు లేదు. వచన కవిత్వం వచనమై తేలిపోతున్నదనీ ఫిర్యాదు మాత్రం ఉంది. బాలగంగాధర్‌తిలక్, గుంటూరు శేషేంద్ర శర్మ, త్రిపురనేని శ్రీనివాస్ వంటి వాళ్లు 1960ల నుంచి “కవిత్వం కావాలి కవిత్వం” అని హెచ్చరిస్తూనే ఉన్నారు. తెలుగు వచన…

Read More

ఈనెల 30 వరకు తెలంగాణ బడ్జెట్ సమావేశాలు

తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు నేడు ప్రారంభమయ్యాయి. గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత సభ రేపటికి వాయిదా పడింది. అనంతరం జరిగిన బీఏసీ సమావేశంలో బడ్జెట్ సమావేశాలను ఈ నెల 30 వరకు కొనసాగించాలని నిర్ణయించారు. రేపు, ఎల్లుండి గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం, చర్చ ఉంటుంది. ఈ నెల 19న ఉగాది పండుగ సందర్భంగా సభకు సెలవు ఉంటుంది. మార్చి 20న డిప్యూటీ సీఎం, రాష్ట్ర ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క వార్షిక బడ్జెట్‌ను…

Read More

పొట్టి శ్రీరాములు వంటి మహనీయుల త్యాగాల వల్లే మనకు స్వేచ్ఛ లభించింది

– పవన్ కల్యాణ్అమరావతిలో అమరజీవి పొట్టి శ్రీరాములు భారీ విగ్రహావిష్కరణ వేడుక తెలుగు వారి ఆత్మగౌరవ ప్రతీకగా నిలిచింది. ఈ విగ్రహాన్ని సీఎం చంద్రబాబు, డీప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ… శ్రీరాములు లాంటి వారు 11 మంది ఉంటే చాలు, ఒక ఏడాదిలోనే దేశానికి స్వాతంత్ర్యం తీసుకురాగలను అని గాంధీజీ అన్నారంటే, ఆయన సంకల్ప బలం ఎంతటిదో అర్థం చేసుకోవచ్చని కొనియాడారు. రాజధాని ప్రాంతంలో ఇంతటి మహోన్నతమైన విగ్రహాన్ని ఏర్పాటు…

Read More

అమరావతిలో పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ఆవిష్కరించిన చంద్రబాబు

ఏపీ రాజధాని అమరావతిలో ఒక మహోన్నతమైన ఘట్టం ఆవిష్కృతమైంది. తెలుగు జాతి ఆత్మగౌరవానికి, ప్రాణత్యాగానికి నిలువుటద్దంగా నిలిచిన అమరజీవి పొట్టి శ్రీరాముల 125వ జయంతి సందర్భంగా తుళ్లూరు సమీపంలోని శాఖమూరు పార్కు సమీపంలో 58 అడుగుల భారీ కాంస్య విగ్రహాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిష్కరించారు. ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆయన చేసిన 58 రోజుల ఆమరణ దీక్షకు గుర్తుగా ఈ విగ్రహాన్ని సరిగ్గా 58 అడుగుల ఎత్తులో రూపొందించడం విశేషం. ఈ వేడుకలో కేంద్రమంత్రి పెమ్మసాని…

Read More

మరుసటి రోజే గ్యారెంటీ డెలివరీ.. తపాలా శాఖ నుంచి సరికొత్త సర్వీస్

పార్శిళ్లు, ఇతర వస్తువుల డెలివరీలో వేగాన్ని పెంచేందుకు భారత తపాలా శాఖ (ఇండియా పోస్ట్) కీలక ముందడుగు వేసింది. 24 స్పీడ్ పోస్ట్ పేరుతో సరికొత్త ఎక్స్‌ప్రెస్ సర్వీసును మంగళవారం (మార్చి 17) ప్రారంభించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. దీని ద్వారా అత్యవసరమైన పార్శిళ్లను కేవలం 24 గంటల్లోనే గ్యారెంటీగా డెలివరీ అందించనుంది.కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, సహాయ మంత్రి డాక్టర్ చంద్రశేఖర్ పెమ్మసాని మంగళవారం మధ్యాహ్నం 12:30 గంటలకు ఢిల్లీలోని ఆకాశవాణి…

Read More

మొజ్తాబా బతికి ఉన్నారో లేదో: ట్రంప్

దుబాయ్: ఇటీవల ఇరాన్ సుప్రీం లీడర్‌గా బాధ్యతలు స్వీకరించిన మొజ్తాబా ఖామేనీపై ట్రంప్ సందేహాలు వ్యక్తం చేశారు. ఆయన బతికే ఉన్నారో…లేదో…అనే విషయం తనకు తెలియదని స్పష్టం చేశారు. యుద్ధం ముగియాలంటే ఇరాన్ పూర్తిగా లొంగిపోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తేల్చి చెప్పారు. కాల్పుల విరమణకు ఇరాన్ సిద్ధంగా ఉందని, ఇరాన్ షరతులు సరిగా లేకపోవడంవల్ల కాల్పుల విరమణ ఒప్పందానికి తాను సిద్ధంగా లేనని పేర్కొన్నారు.బాగానే ఉన్నా: నెతన్యాహుతన మరణంపై వచ్చిన వదంతులకు ఇజ్రాయెల్ ప్రధాని…

Read More