కాలువ కాదు…! రోడ్డే…!


విశాలాంధ్ర – కడియం : దేశవ్యాప్తంగా నర్సరీలకు ప్రసిద్ధి చెందిన తూర్పుగోదావరి జిల్లా, కడియం మండలం, కడియపులంక పంచాయతీ పరిధిలోని, బుర్రిలంక గ్రామంలో శనివారం ఉదయం కురిసిన చిన్నపాటి వర్షానికే వీధులు వర్షపు నీరుతో నిండి కాలువలను తలపిస్తున్నాయి. గ్రామంలోని పాత వినాయకుడు గుడి వీధిలో పరిసరాలు పూర్తిగా జలమయమయ్యాయి. వర్షపు నీరు ఇళ్లల్లోకి చేరింది. దీనితో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. చిన్నపాటి వర్షానికి వీధులు మునిగిపోవడంపై మండిపడుతున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని భద్రతను దృష్టిలో పెట్టుకొని, స్థానిక అధికారులు నాయకులు తక్షణమే స్పందించి, వర్షం నీరు బయటకు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ సమస్య మరలా మరలా పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం దిశగా ప్రయత్నించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

The post కాలువ కాదు…! రోడ్డే…! appeared first on Visalaandhra.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *