– శ్రీ వివేకానంద డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ కరణం హర్షవర్థన్
విశాలాంధ్ర ధర్మవరం;;ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మక క్వాంటం వ్యాలీ కి అనుగుణంగా ఈ విద్యా సంవత్సరం నుండి బీఎస్సీ క్వాంటం టెక్నాలజీ కోర్సును స్థానిక రేగాటిపల్లి రోడ్డు నందు గల శ్రీ వివేకానంద డిగ్రీ కళాశాల నందు ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభించటానికి ఆంధ్రప్రదేశ్ కౌన్సిల్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ అనుమతులను మంజూరు చేసిందని కళాశాల ప్రిన్సిపాల్ కరణం హర్షవర్థన్ తెలిపారు. ధర్మవరం పట్టణంలో గత 21 సంవత్సరాలుగా క్రమశిక్షణతో కూడిన డిగ్రీ విద్యను అందిస్తూ విద్యార్థులకు అందుబాటులో ఉన్నతమైన కోర్సులను ఉంచుతున్నామని వారు తెలిపారు. అలాగే ధర్మవరం పట్టణంలో బిసియే, బిబియే , బీఎస్సీ క్వాంటం టెక్నాలజీ కోర్సును అందిస్తున్న ఏకైక కళాశాల శ్రీ వివేకానంద డిగ్రీ కళాశాల అని కూడా వారు తెలిపారు. అర్హత కలిగిన ప్రతి విద్యార్థికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ పథకం వర్తిస్తుంది అని పేర్కొన్నారు.అడ్మిషన్ కోరు వారు పదవ తరగతి, ఇంటర్, కుల ధృవీకరణ, ఆదాయ ధృవీకరణ, ఆధార్ కార్డు నకలు కాపీలతో తమ కళాశాల ఆఫీసు నందు పేర్లను నమోదు చేసుకోవచ్చునని తెలిపారు.మరిన్ని వివరాలకు ప్రిన్సిపాల్ హర్ష వర్ధన్ – 9912679876, కళాశాల ఇంచార్జి రమేష్ -9052984089 నంబర్లకు సంప్రదించాలని తెలిపారు.
The post బీఎస్సీ క్వాంటం టెక్నాలజీ కోర్సును సద్వినియోగం చేసుకోండి appeared first on Visalaandhra.


