హైదరాబాద్‌లో కాక్రోచ్ జనతా పార్టీ భారీ నిరసన.. ధర్నాచౌక్‌లో ఉద్రిక్తత!


దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన ఃకాక్రోచ్ జనతా పార్టీః హైదరాబాద్‌లో నిరసన చేపట్టింది. పరీక్షా పత్రాల లీకేజీలు, విద్యా వ్యవస్థలోని అవకతవకలకు వ్యతిరేకంగా ధర్నాచౌక్ వద్ద భారీ ప్రదర్శన నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పర్యావరణవేత్త, ఉద్యమ నేత సోనమ్ వాంగ్‌చుక్‌తో పాటు విశ్రాంత ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి తదితరులు పాల్గొన్నారు. అలాగే పెద్ద సంఖ్యలో యువత కూడా ఈ నిరసనలో భాగమైంది. ఈ సందర్భంగా నిరసనకారులు నీట్ లీకేజీ వ్యవహారంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

విద్యార్థులకు అన్యాయం జరిగింది
ఆకునూరి మురళి మాట్లాడుతూ దేశంలోని సంపద పంపిణీ, నిరుద్యోగ పరిస్థితులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఃఃదేశంలో ఎంతో సంపద ఉంది. అది ఎక్కడికి వెళ్తోంది? నిరుద్యోగం ఎందుకు పెరుగుతోంది? యువతను ఃకాక్రోచ్‌లుగాః పేర్కొనడం ఏంటి? దేశంలో కేవలం ఆరు శాతం యువతకే నైపుణ్యాలు ఉన్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. మరి మిగతావారికి ఆ నైపుణ్యాలు ఎందుకు అందడం లేదని ప్రశ్నించారు. అలాగే విద్యార్థులకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, అవసరమైతే ఆయనను జైలుకు పంపాలని కూడా ఆకునూరి మురళి డిమాండ్ చేశారు.

The post హైదరాబాద్‌లో కాక్రోచ్ జనతా పార్టీ భారీ నిరసన.. ధర్నాచౌక్‌లో ఉద్రిక్తత! appeared first on Visalaandhra.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *