ప్రభుత్వ సేవలన్నీ ఒకే యాప్‌లో.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు


రాష్ట్రంలోని ప్రభుత్వ సేవలన్నింటినీ ప్రజలకు మరింత సులభంగా చేరువ చేసేందుకు ఒక ప్రత్యేక మొబైల్ అప్లికేషన్‌ను అభివృద్ధి చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఃమన మిత్రః వాట్సాప్ ప్లాట్‌ఫామ్‌కు కొనసాగింపుగా, ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే సేవలు పొందేలా ఈ యాప్‌ను రూపొందించాలని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి తన క్యాంపు కార్యాలయంలో నిన్న రియల్-టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్), ఇతర శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ ఆదేశాలు జారీ చేశారు. పట్టణ ప్రాంతాల తరహాలోనే గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఃమన మిత్రః సేవలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. ఈ సమీక్షలో పలు కీలక అంశాలపై సీఎం దిశానిర్దేశం చేశారు. పట్టణాల్లో మాదిరిగానే అన్ని ప్రాంతాల్లోని క్యాంటీన్ల ద్వారా మెరుగైన సేవలు అందించాలని, తాగునీటి నాణ్యత విషయంలో నిరంతరం అప్రమత్తంగా ఉంటూ ప్రతిరోజూ నీటి నమూనాలను పరీక్షించాలని ఆదేశించారు. పారిశుద్ధ్య నిర్వహణలో ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించాలని, ఃజలధారః వంటి కార్యక్రమాల ద్వారా వర్షాకాలంలో లభించే నీటి వనరులను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

అనంతపురం జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన సాంకేతిక ఆధారిత ప్రభుత్వ భూముల పరిరక్షణ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని సీఎం సూచించారు. గంజాయి సాగును మూలాల్లోనే అరికట్టాలని, మహిళలపై నేరాలను అణచివేయడానికి అత్యంత కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆర్టీజీఎస్, అవేర్ సిస్టమ్స్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన పాలనా విధానాలపై కేంద్రం ఆసక్తి చూపిస్తోందని, త్వరలో జరగనున్న నీతి ఆయోగ్ సమావేశంలో వీటిని వివరించనున్నట్లు చంద్రబాబు వెల్లడించారు. ఈ సమావేశంలో మంత్రి కొలుసు పార్థసారథి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *