నీట్ రీ-టెస్ట్‌పై సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు.. సీబీటీ పిటిషన్ తిరస్కరణ


జూన్ 21న ఓఎంఆర్ పద్ధతిలోనే పరీక్ష యథాతథంగా జరుగుతుందని స్పష్టం
నీట్ (యూజీ) 2026 రీ-టెస్టును కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ) విధానంలో నిర్వహించాలని దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం తిరస్కరించింది. దీంతో, ముందుగా నిర్ణయించిన ప్రకారం జూన్ 21న ఓఎంఆర్ విధానంలోనే ఈ పరీక్ష జరగనుంది. ఈ మేరకు ఆర్జేడీ ఎంపీ సుధాకర్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ పి.ఎస్. నరసింహ, జస్టిస్ అరవింద్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది.

ఈ దశలో పరీక్షా విధానాన్ని మార్చడం వల్ల తీవ్రమైన నిర్వహణాపరమైన సవాళ్లు ఎదురవుతాయని కోర్టు అభిప్రాయపడింది. సమయాభావం, ఎన్టీఏపై ఉన్న ఒత్తిడిని పరిగణనలోకి తీసుకుని ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఁఇలాంటి అభ్యర్థనలను గతంలోనే తిరస్కరించాం. ఈ అంశాన్ని వెకేషన్ తర్వాత జులైలో విచారిస్తాంఁ అని జస్టిస్ నరసింహ స్పష్టం చేశారు.

మే 3న జరిగిన నీట్ (యూజీ) 2026 పరీక్షలో పేపర్ లీక్ ఆరోపణలు రావడంతో దాన్ని రద్దు చేసిన విషయం తెలిసిందే. వాట్సాప్‌లో సర్క్యులేట్ అయిన ఃగెస్ పేపర్‌ఃలోని సుమారు 120 ప్రశ్నలు అసలు ప్రశ్నపత్రంతో సరిపోలడంతో ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ జరుగుతోంది. 22 లక్షల మందికి పైగా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పరీక్షను మళ్లీ నిర్వహించాలని నిర్ణయించారు.

జూన్ 21న జరిగే రీ-టెస్ట్ కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) బహుళస్థాయి అథెంటికేషన్, పటిష్ఠ నిఘా వంటి కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టింది. మరోవైపు, నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకు 2027 నుంచి నీట్ (యూజీ)ని సీబీటీ విధానంలో నిర్వహించేందుకు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖతో సంప్రదింపులు జరుపుతున్నట్టు ఎన్టీఏ కోర్టుకు తెలిపింది. సుప్రీంకోర్టు తాజా నిర్ణయంతో పరీక్ష విధానంపై విద్యార్థులకు స్పష్టత లభించింది.

The post నీట్ రీ-టెస్ట్‌పై సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు.. సీబీటీ పిటిషన్ తిరస్కరణ appeared first on Visalaandhra.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *