విశాలాంధ్ర-దుండిగల్ : గురువారం లక్ష్మీనారాయణ ఆకస్మిక మరణం పట్ల బాచుపల్లి 17వ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఆగం రాజు ముదిరాజ్ తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ వారి ఆధ్వర్యంలో కాలనీ వాసులు ఘనంగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.అనంతరం ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ ఆగం రాజు ముదిరాజ్ కాలనీ ప్రజలతో కలిసి ఘన నివాళులర్పించారు.


