:విశాలాంధ్ర బ్యూరోకర్నూలు : కూటమి ప్రభుత్వం అభివద్ది సంక్షేమం రెండు కళ్ళవలే చూస్తూ సంపదను సష్టించుకుంటూ అభివద్ది చేస్తుందని, 2019 `2024 5సంవత్సరాలల్లో వైసీపీ రాష్ట్రంలో ఆర్థిక విద్వంసం చేసిందని జిల్లా ఇన్చార్జి మంత్రి నిమ్మల రామనాయుడు అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో బడ్జెట్ అవుట్ రీచ్ కార్యక్రమంలో మంత్రి టీజీ భరత్గుప్తా, జిల్లా ప్రజాప్రతినిధులు, కలెక్టర్లతో కలసి ఆయన పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన, వైసీపీ దివాలా పాలన అనంతరం రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని చంద్రబాబు ఎలా మెరుగు పరుస్తున్నారో మంత్రి నిమ్మల రామనాయుడు వివరించారు. అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళు గా కూటమి ప్రభుత్వం పాలన అందిస్తుందన్నారు.2024 వరకు రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి వెంటిలేటర్ మీద ఉండేదని వెంటి లెటర్ మీద ఉన్న ఆర్ధిక వ్యవస్థను ప్రధాని మోదీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ల సహకారం తో చంద్రబాబు చక్కదిద్దుతున్నారు.విభజన సమయంలో 58 శాతం జనాభా ఉన్న ఆంధ్రప్రదేశ్ కు, కేవలం 46 శాతం మాత్రమే వనరులు దక్కాయన్నారు. నిత్యం ప్రకృతి విపత్తులు, తుఫానుల తో అల్లాడే రాష్ట్రాన్ని చంద్రబాబు మెరుగైన పాలనతో గాడి లో పెడుతున్నామన్నారు. రాష్ట్ర విభజన కంటే గత 5 ఏళ్ళ వైసీపీ పాలనతోనే ఎక్కువ నష్టం జరిగిందన్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీ లు కడుతూ, సంక్షేమ పధకాలు అమలు చేస్తున్నామన్నారు. గత వైసీపీ పాలనలో జీతాలు వస్తే చాలు అని ఉద్యోగులు అనుకునేవారని నేడు ఒకటో తారీఖునే ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు అందిస్తున్నామన్నారు.నాడు జగన్ మెగా డిఎస్సి అని చెప్పి యువతను మోసం చేశాడన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం మెదటి ఏడాదే మెగా డిఎస్సి ద్వారా 15941 టీచర్ పోస్టులు భర్తీ చేశామని, నాడు జగన్, ఇంట్లో ఒక్కరికే మేనమామ అని అమ్మఒడి అందిస్తే నేడు ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి, ఒక్కొక్కరికి 15 వేల రూపాయల చొప్పున తల్లికి వందనం ద్వారా అందిస్తున్నామన్నారు. గత 21 నెలల్లో ఆర్ధిక ఇబ్బందులున్నా సంక్షేమం, అభివృద్ధికి సమ ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు. గత 5 ఏళ్ల పాలన లో విద్యార్థులను మన రాజధాని ఏది అంటే చెప్పలేని పరిస్థితి ఉండేదన్నారు.నేడు అమరావతిని శాశ్వత రాజధానిగా నిర్మిస్తున్నామని, విధ్వంసమైన పోలవరంను గాడిలో పెట్టామన్నారు. 2027 నాటికి పోలవరం ను పూర్తి చేస్తామన్నారు.జగన్ పాలన చూసి రాష్ట్రం వదిలి పారిపోయిన పారిశ్రామిక వేత్త లను, పరిశ్రమలను, ఇంక జగన్ రాడు అనే భరోసా ఇచ్చి తిరిగి తీసుకొస్తున్నాం.కర్నూలు పశ్చిమ ప్రాంతం అభివృద్ధి పై మాస్టర్ ప్లాన్ తయారు చేయమని చంద్రబాబు ఆదేశించారన్నారు. తుంగభద్ర డ్యామ్ కు 33 గేట్లకు గానూ, 19 గేట్లు కొత్తవి ఏర్పాటు చేస్తున్నామన్నారు.శ్రీశైలం ప్లంజ్ పూల్ ప్రమాదం లో ఉందని నిపుణులు చెప్పినా జగన్ కన్నెత్తి చూడలేదన్నారు.రాయలసీమ లో చెరువులు నిండు కుండలా కళ కళ లాడుతున్నాయి.మరలా జగన్ వస్తే రాష్ట్రం ఇక కోలుకోలేదు.
సంపదను సృష్టించుకుంటూ, సంపదను ప్రజలకు పంచేలా చంద్రబాబు పాలన చేస్తున్నారు. సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రివర్యులు టీజీ భరత్ గుప్తా, జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి, ఆదోని ఎమ్మెల్యే డా.పార్థసారథి, కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి, పత్తికొండ ఎమ్మెల్యే కే.ఈ.శ్యామ్ కుమార్,ఎమ్మిగనూరు ఎమ్మెల్యే జయ నాగేశ్వర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్, టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ, మంత్రాలయం టీడీపీ ఇంచార్జి రాఘవేంద్ర రెడ్డి, ఆలూరు టీడీపీ పార్టీ ఇంచార్జి వైకుంఠం జ్యోతి. వివిధ కార్పొరేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.


