విశాలాంధ్ర – నార్పల (అనంతపురం జిల్లా): క్రికెట్ బెట్టింగ్లకు దూరంగా ఉండాలని, వాటి వల్ల జీవితాలు నాశనం చేసుకోకూడదని నార్పల ఎస్సై సాగర్ ప్రజలకు సూచించారు. బెట్టింగ్లో పాల్గొనేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, క్రికెట్ మ్యాచ్ల సమయంలో ఆన్లైన్, ఆఫ్లైన్ బెట్టింగ్లు పెరుగుతున్నాయని, ముఖ్యంగా యువత వీటి బారిన పడుతున్నారని తెలిపారు. బెట్టింగ్ చట్టవిరుద్ధమని, అలాంటి కార్యకలాపాల్లో పాల్గొంటే కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.బెట్టింగ్ను అరికట్టేందుకు పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజలు అనుమానాస్పద కార్యకలాపాలపై వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.అలాగే, తల్లిదండ్రులు తమ పిల్లల ఆన్లైన్ కార్యకలాపాలపై పర్యవేక్షణ ఉంచాలని, యువత తప్పుదోవ పట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అక్రమ సంపాదన ఆశతో జీవితాలను పణంగా పెట్టొద్దని, శ్రమతో సంపాదించినదే స్థిరమైనదని ఎస్సై పేర్కొన్నారు.ప్రజలు చట్టాన్ని గౌరవించి, సమాజంలో శాంతి భద్రతలకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.


