మూడవ మద్యం బార్ ను కైవసం చేసుకున్న రుద్ర రవికుమార్


విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ధర్మవరంలో మూడవ మద్యం బార్ రుద్ర రవికుమార్ లక్కీ డ్రా లో విజేతగా నిలవడం జరిగిందని ఎక్సైజ్ సిఐ చంద్రమణి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బుధవారం పుట్టపర్తి లోని కలెక్టరేట్ ఆఫీసులో పారదర్శకంగా మద్యం దుకాణాల కేటాయింపు జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమం కలెక్టర్ శ్యాంప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిందని తెలిపారు. అనంతరం సీఐ చంద్రమణి మాట్లాడుతూ బార్ లైసెన్స్ కేటాయింపు ప్రక్రియ పారదర్శకంగా జరిగిందని జిల్లా ప్రొహిబిషన్ ఎక్సైజ్ అధికారి గోవింద నాయక్ దరఖాస్తుల సమక్షంలో లాటరీ ప్రక్రియ నిర్వహించడం జరిగిందన్నారు. ఈ లాటరీ ప్రక్రియలో ధర్మవరం పట్టణములోని నోటిపై చేసిన ఒక బార్కోసం ముగ్గురు వ్యక్తుల నుండి మొత్తము నాలుగు దరఖాస్తులు అందాయని, అందులో లాటరీలో విజేత రుద్రా రవికుమార్ నిలవడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ శాఖ సిబ్బంది, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *