యుద్ధం వేళ పాక్‌కు ఇంధన కష్టాలు


ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్, విద్యార్థులకు ఆన్‌లైన్ తరగతులు

ఇస్లామాబాద్: అమెరికా`ఇజ్రాయిల్ సంయుక్తంగా ఇరాన్‌పై యుద్ధం చేస్తున్న వేళ హర్మూజ్ జల సంధి మూతబడిన క్రమంలో పాకిస్థాన్ చిక్కుల్లో పడింది. ఆ దేశానికి చమురు దిగుమతులు నిలిచిపోయే ప్రమాదం ఏర్పడింది. ఇప్పటికే ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొంటున్న పాక్… ఇప్ప్పుడు ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొనాల్సిన పరిస్థితులు నెలకొనడంతో బెంబేలెత్తిపోయింది. చమురు వినియోగాన్ని తగ్గించే ప్రయత్నాలు పడింది. దీంతో కొవిడ్ సమయంలో చేపట్టి చర్యలు, విధించిన ఆంక్షలను అమల్లోకి తెచ్చింది. ఉద్యోగులకు ఇంటి నుంచి పనిచేయాలని ఆదేశించింది. విద్యార్థులకు ఆన్‌లైన్ తరగతులకు అనుమతి ఇచ్చింది. రోడ్లపై వాహనాలను పరిమితం చేసింది. గల్ఫ్‌లో సుమారు 47 లక్షల మంది పాకిస్ధానీయులు ఉన్నారు. యుద్ధం వేళ లావాదేవీలు నిలిచిపోవడంతో పాక్‌కు ఆర్థికంగా మరింత ఇబ్బంది ఎదురవుతోంది. అత్యవసరమైన సిబ్బంది మాత్రమే కార్యాలయాలకు వెళ్లాలని పాక్ ఆదేశాలు జారీ చేయబోతోందని డాన్ పత్రిక వెల్లడించింది. టెలికం, ఐటీ కంపెనీల సిబ్బంది వారంలో రెండు రోజులు వర్క్ ఫ్రం హోమ్ చేయాలని ఆదేశాలు ఇవ్వనున్నట్లు తెలిపింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *