విశాలాంధ్ర – పాయకరావుపేట : ప్రముఖ వ్యాపారవేత్త, పాయకరావుపేట పిఎసిఎస్ అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ నాయకులు దేవవరపు రాజుబాబు, హైకోర్టు న్యాయవాది వంకా నారాయణరావు హైదరాబాదులో ప్రముఖులను మర్యాదపూర్వకంగా కలిశారు. భారత ప్రభుత్వ హోమ్ వ్యవహారాల శాఖ మంత్రి బండి సంజయ్ కుమార్ ను, హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ ను, 99 టీవీ చైర్మన్ తోట చంద్రశేఖర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రముఖులతో దేవవరపు రాజుబాబు పలు విషయాలను చర్చించారు.


