టూ వీలర్ లో ప్రయాణం చేసిన మున్సిపల్ కమిషనర్ వెంకట రమణయ్య


విశాలాంధ్ర ధర్మవరం : ప్రభుత్వ వాహనాలలో ఇంధన పొదుపు చేయాలన్న ఆదేశాల మేరకు ధర్మవరం పురపాలక సంఘ కమిషనర్ వెంకటరమణయ్య తన వద్ద ఉన్న ద్విచక్ర వాహనంలో తెల్లవారుజామున 5 గంటల నుంచి 8 గంటల వరకు మాస్టర్ కార్యాలయ తనీఖీలు, వాళ్లు వార్డులలో కార్మికులు ఏ విధంగా పనిచేస్తున్నారు? ఏవైనా సమస్యలు ఉన్నాయా? అన్న వాటిని అడిగి తెలుసుకున్నారు. తదుపరి అక్కడక్కడ వార్డు ప్రజలతో కాలువ శుభ్రత, వాటి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పట్టణ పరిశుభ్రతలో ఏదైనా లోపాలు వస్తే ప్రజలు నేరుగా కార్యాలయంలో ఫిర్యాదు చేయవచ్చునని తెలిపారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *