నెలసరి సెలవులు ఇస్తే మహిళలకు ఉద్యోగాలు ఎవరిస్తారు?

: సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలునెలసరి సెలవును (Menstrual Leave) తప్పనిసరి చేస్తే అది మహిళల ఉపాధి అవకాశాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. మనం అలాంటి చట్టాలు చేస్తే.. కంపెనీలు మహిళలను తీసుకోవని అభిప్రాయపడింది. ఇలాంటి సెలవులను చట్టబద్ధం చేయడం వల్ల మహిళా సాధికారతకు మేలు కంటే కీడే ఎక్కువ జరుగుతుందని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయ పడింది. పీరియడ్స్ లీవ్ ఇవ్వాలని మేము చట్టం చేస్తే.. రేపు మహిళలకు ఉద్యోగాలు ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రారు…

Read More

తణమూల్ నేతలకు అపాయింట్‌మెంట్ ఇవ్వని రాష్ట్రపతి

న్యూదిల్లీ: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును కలిసేందుకు అపాయింట్‌మెంట్ కోరిన తృణమూల్ నేతలకు చుక్కెదురైంది. సమయాభావం వల్ల వారిని రాష్ట్రపతి కలవడం సాధ్యం కాదని అధికార వర్గాలు పేర్కొన్నాయి. పశ్చిమబెంగాల్‌లో ఆదివాసీలకు అందుతున్న సంక్షేమ పథకాలను రాష్ట్రపతికి తెలియజేసేందుకు 12 మంది సభ్యులతో కూడిన టీఎంసీ బృందం అనుమతి కోరగా.. ఈ మేరకు సమాధానం వచ్చింది. అయితే, వచ్చే వారం అయినా తమకు రాష్ట్రపతి సమయం కేటాయించాలని కోరుతూ ఆ బృందం మరో లేఖను రాష్ట్రపతి భవన్‌కు పంపించినట్లు…

Read More

కాంగ్రెస్ నేతల మధ్య లేఖల యుద్ధం

పరస్పరం లేఖాస్త్రాలు సంధించుకుంటున్న అయ్యర్, థరూర్ న్యూదిల్లీ: సీనియర్ కాంగ్రెస్ నేతలు పరస్పరం లేఖాస్త్రాలు సంధించుకుంటున్నారు. సీనియర్ నేతలు మణిశంకర్ అయ్యర్, శశిథరూర్ బహిరంగ లేఖల రూపంలో తాజాగా పరస్పరం తీవ్ర విమర్శలు గుప్పించుకున్నారు. థరూర్‌తో సంబంధాలను పూర్తిగా తెంచేసుకుంటున్నట్లు అయ్యర్ పేర్కొనగా.. ఆయన తీరును థరూర్ తీవ్రంగా తప్పుబట్టారు. థరూర్‌కు అయ్యర్ రాసిన బహిరంగ లేఖ ఓ మ్యాగజీన్‌లో ఇటీవల ప్రచురితమైంది. ఈ నెల 6న థరూర్ ఓ టీవీ ఛానల్‌తో మాట్లాడుతూ… ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్…

Read More

అమెరికా సామ్రాజ్యవాద దుశ్చర్యల్ని ఖండించండి – Visalaandhra

. ప్రపంచశాంతి ఉద్యమంలో ప్రజలు కలిసి రావాలి. వామపక్ష నేతల పిలుపు. ఇరాన్‌పై అమెరికా`ఇజ్రాయిల్ దాడులను వ్యతిరేకిస్తూ నిరసన విశాలాంధ్రవిజయవాడ: సామ్రాజ్యవాదంతో అనేక దేశాలపై దాడులకు పాల్పడుతున్న అమెరికా దుశ్చర్యలను ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని, ప్రపంచ శాంతి కోసం వామపక్షాలు చేస్తున్న ఉద్యమాలకు ప్రజలు కలిసి రావాలని వామపక్ష నేతలు పిలుపునిచ్చారు. మాదకద్రవ్యాలు ఎగుమతులు చేస్తున్నాయని, అణుబాంబులు ఉన్నాయనే కుంటిసాకులతో స్వప్రయోజనాల కోసం అమెరికా విచక్షణారహితంగా చిన్న చిన్న దేశాలపై దాడులకు తెగబడుతోందని మండిపడ్డారు. ఇరాన్‌పై అమెరికా,…

Read More

స్మార్ట్ మీటర్ల బిగింపువేగవంతం – Visalaandhra

విద్యుత్ శాఖకు పార్లమెంటరీ కమిటీ సూచన న్యూదిల్లీ: దేశవ్యాప్తంగా విద్యుత్ స్మార్ట్ మీటర్ల బిగింపు ప్రక్రియను వేగవంతం చేయాలని పార్లమెంటరీ కమిటీ విద్యుత్ మంత్రిత్వ శాఖను కోరింది. అలాగే బిల్లింగ్, డేటా గోప్యత, ఆర్‌డిఎసఎస్ లక్ష్యాలపై ఆందోళనలు లేవనెత్తింది. స్మార్ట్ మీటర్ల బిగింపు నిర్మాణాత్మకంగా, సమయానుకూల పద్ధతిలో వేగవంతం చేయడానికి అత్యవసర చర్యలు చేపట్టాలని తెలిపింది. ‘విద్యుత్ మంత్రిత్వ శాఖ గ్రాంట్ల డిమాండ్ల(2026-27)’పై కమిటీ 11వ నివేదికను గురువారం పార్లమెంటులో ప్రవేశపెట్టారు. దేశవ్యాప్తంగా స్మార్ట్ మీటర్ల బిగింపు…

Read More

సరకు రవాణాలోవిశాఖ పోర్టు రికార్డు

విశాలాంధ్ర – విశాఖపట్నం: సరకు రవాణాలో విశాఖ పోర్టు అథారిటీ(వీపీఏ) రికార్డు సృష్టించిం ది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 345 రోజుల్లోనే 85.07 మిలియన్ మెట్రిక్ టన్నుల సరకు రవాణా చేసింది. తద్వారా చరిత్రాత్మక మైలు రాయిని చేరుకుంది. 92 ఏళ్ల విశాఖ పోర్టు చరిత్రలో ఈ స్థాయి సరకు రవాణా ఎప్ప్పుడు జరగలేదు. ఈ ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించిన 90 ఎంఎంటీ సరకు నిర్వహణ లక్ష్యాన్ని సాధిస్తామన్న నమ్మకం ఉన్నట్లు పోర్టు అథారిటీ చైర్మన్ డాక్టర్…

Read More

మహారాష్ట్ర అసెంబ్లీకి బాంబు బెదిరింపు – Visalaandhra

ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీకి బాంబు బెదిరింపులు రావటంతో తీవ్ర కలకలం చెలరేగింది. ముంబైలోని విధాన్ భవన్‌లో బాంబు పెట్టామంటూ గుర్తు తెలియని దుండగులు గురువారం ఉదయం అధికారులకు మెయిల్ పెట్టారు. దీంతో అధికారులు అప్రమత్తమ య్యారు. బాంబ్ స్క్వాడ్ బృందాన్ని రంగంలోకి దింపారు. అసెంబ్లీలోని వారందరినీ దూరంగా పంపించేశారు. బాంబ్ స్క్వాడ్‌తో పాటు పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అసెంబ్లీలో ఎలాంటి బాంబు లేదని తేలింది. దర్యాప్తు అధికారులు బెదిరింపులకు పాల్పడ్డ వారికోసం గాలిస్తున్నారు. బాంబు బెదిరింపులతో అసెంబ్లీలో…

Read More

స్పీకర్ నిర్ణయమే అంతిమం: సుప్రీం – Visalaandhra

న్యూదిల్లీ: తెలంగాణలో బీఆరఎస్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు కేసు ముగిసింది. రాష్ట్ర రాజకీయాల్లో కొన్నిరోజులుగా తీవ్ర కలకలం రేపిన ఈ కేసు విచారణను గురువారం సుప్రీంకోర్టు ముగించింది. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై నిర్ణీత గడువులోగా నిర్ణయం తీసుకోవాలని చెప్పినా… స్పీకర్ నిర్ణయం తీసుకోలేదని బీఆరఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేటీఆర్, బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ విచారణకు రాగా… సర్వోన్నత న్యాయస్థానం డిస్పోజ్ చేసింది….

Read More

సీఈసీపై అభిశంసన – Visalaandhra

నేడు పార్లమెంటు ముందుకు200 మంది ఎంపీల సంతకాలు న్యూదిల్లీ: ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ అభిశంసనకు ప్రతిపక్షాలు సిద్ధమయ్యాయి. పార్లమెంటు ఉభయ సభల్లో శుక్రవారం నోటీసు సమర్పించనున్నాయి. 130 మంది లోక్‌సభ ఎంపీలు, 63 మంది రాజ్యసభ ఎంపీలు దీనిపై సంతకాలు చేశారు. గురువారం కూడా కొందరు సభ్యులు ముందుకొచ్చి సంతకాలు చేశారని ప్రతిపక్ష నాయకుడు ఒకరు తెలిపారు. నిబంధనల ప్రకారం 100 మంది ఎంపీలు సంతకాలు చేస్తే లోక్‌సభలో, 50 మంది మద్దతిస్తే…

Read More

బలహీన ప్రధాని మోదీ – Visalaandhra

. దేశ గౌరవం ట్రంప్‌కు తాకట్టు. యుద్ధ ప్రభావంతో ధరల పెరుగుదల. ముర్ము వైఖరి సమర్థనీయం కాదు. కమ్యూనిస్టు సిద్ధాంతం శాశ్వతం నారాయణ విశాలాంధ్ర బ్యూరో-ఖమ్మం: ప్రపంచంలోనే అత్యంత బలమైన ప్రజాస్వామ్య పునాదులున్న భారతదేశానికి మోదీ అత్యంత బలహీన ప్రధాని అని, యుద్ధాన్ని ఆపే కనీస ప్రయత్నం చేయడం లేదని సీపీఐ జాతీయ నాయకుడు డాక్టర్ కె. నారాయణ ఆరోపించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు సాగిలపడటం తప్ప మోదీ మరేపని చేయలేక పోతున్నారని అన్నారు. ఇందిరాగాంధీకి ఉన్న…

Read More