ఇరాన్ అధినేత ముజ్తబా – Visalaandhra

. ఖామేనీ రెండో కుమారుడి ఎన్నిక. దేశవ్యాప్తంగా సంబరాలు. తెహ్రాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్ దాడులు మరింత తీవ్రం. బాలిస్టిక్ క్షిపణులతో ఇరాన్ప్ర తి దాడులు తెహ్రాన్: ఇజ్రాయిల్, అమెరికాతో యుద్ధం భీకరంగా సాగుతున్న వేళ ఇరాన్ తన కొత్త సుప్రీం లీడర్‌ను ఎన్నుకుంది. అమెరికా హెచ్చరికలను భేఖాతరు చేస్తూ ఖమేనీ రెండో కుమారుడు ముజ్తబా ఖామేనీని కొత్త నేతగా ప్రకటించింది. ఇరాన్‌లోని 88మంది మతగురువులతో కూడిన ‘అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స’ కొత్త సుప్రీం లీడర్‌గా ఖమేనీ కుమారుడు…

Read More

ఐపీఎస్ సునీల్‌కు చుక్కెదురు

విశాలాంధ్ర బ్యూరో` అమరావతి:శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ఐపీఎస్ అధికారి ఎం.సునీల్‌నాయక్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ అర్హతపై హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది. ఈ నెల 12 వరకు సునీల్ నాయక్ విచారణకు హాజరు కావాల్సిందేనని హైకోర్టు ఆదేశించింది. గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు సునీల్ నాయక్ విచారణ సోమవారంతో ముగియనుండగా… దర్యాప్తు అధికారి విజ్ఞప్తి మేరకు విచారణను హైకోర్టు పొడిగించింది. అలాగే సునీల్ నాయక్ దాఖలు…

Read More

నిందితులకుసుప్రీంలో చుక్కెదురు

రెవెన్యూ దస్త్రాల దహనం కేసు… న్యూదిల్లీ: అన్నమయ్య జిల్లా మదనపల్లెలో రెవెన్యూ దస్త్రాల దహనం కేసులో ఇద్దరు నిందితులకు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. ఈ కేసులో ఏ3గా ఉన్న మాధవరెడ్డి, ఏ4గా ఉన్న మునిరత్నానికి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. దర్యాప్తు పురోగతికి తాము అడ్డురాలేమని జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ మన్మోహన్‌తో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. నిందితుల్లో ఒకరు మాజీమంత్రి పెద్దిరెడ్డి మాజీ పీఏ కాగా, మరొకరు ప్రధాన అనుచరుడిగా ఉన్నారు….

Read More

ఇరాన్‌కు రష్యా పూర్తి అండగా ఉంటుంది

మాస్కో: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరిన వేళ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇరాన్ కు తన మద్దతును ప్రకటించారు. ఇజ్రాయిల్, అమెరికాలతో సాగు తున్న ఘర్షణల్లో మిత్రదేశమైన ఇరా న్‌కు మాస్కో అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. ఇరాన్ నూతన సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టిన ముజ్తబా ఖామేనీకి పుతిన్ అభినందనలు తెలుపుతూ, ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో దేశాన్ని సమర్థ వంతంగా నడిపించగలరని ఆశాభా వం వ్యక్తం చేశారు. సరిహద్దుల్లో ఎదురవుతున్న సాయుధ…

Read More

అమెరికాలో జోరుగా ‘ఉస్తాద’ ప్రీమియర్ బుకింగ్స్

హైదరాబాద్: హరీశ్ శంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ అంచనాలకు తగ్గట్టే సినిమా విడుదలకు ముందే ఓవర్సీస్ మార్కెట్‌లో తన సత్తా చాటుతోంది. ముఖ్యంగా నార్త్ అమెరికాలో ఈ సినిమాకు అద్భుతమైన స్పందన లభిస్తోంది. అక్కడ ప్రీమియర్ షోల బుకింగ్స్ ప్రారంభమైన కొన్ని గంటల్లోనే 50 వేల డాలర్లకు (భారత కరెన్సీలో సుమారు రూ. 41 లక్షలు) పైగా గ్రాస్…

Read More

కరూర్ తొక్కిసలాట కేసు.. విజయ్‌కి సీబీఐ మరోసారి నోటీసులు

గత సంవత్సరం చోటుచేసుకున్న కరూర్ తొక్కిసలాటకు సంబంధించిన కేసులో ప్రముఖ నటుడు, టీవీకే అధినేత విజయ్‌కి కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 10 విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొంది. ఈ కేసులో విజయ్‌ని సీబీఐ గతంలో విచారించింది. తాజాగా మరోసారి విచారించడానికి సమన్లు జారీ చేసింది. జనవరి నెలలో రెండు పర్యాయాలు సీబీఐ అతనిని విచారించింది. గత సంవత్సరం సెప్టెంబర్ 27న కరూర్‌లో విజయ్ నిర్వహించిన ప్రచార…

Read More

చాట్‌జీపీటీతో కాపీయింగ్.. మహారాష్ట్రలో 81 మంది ఉద్యోగులపై వేటు

మహారాష్ట్రలో 10, 12వ తరగతి పరీక్షల్లో భారీగా మాస్ కాపీయింగ్ నిందితులపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన అధికారులుమహారాష్ట్రలో ఇటీవల జరిగిన 10, 12వ తరగతి బోర్డు పరీక్షల్లో భారీ స్థాయిలో మాస్ కాపీయింగ్ జరిగినట్లు వెలుగులోకి వచ్చింది. విద్యార్థులకు అక్రమంగా సహాయం చేసినందుకు గాను 81 మంది పరీక్షా సిబ్బందిని మహారాష్ట్ర విద్యా బోర్డు సస్పెండ్ చేసింది. ఈ వ్యవహారంలో కొందరు సిబ్బంది సమాధానాల కోసం చాట్‌జీపీటీ వంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాధనాలను…

Read More

కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయంలో ఆరవ తరగతికి ప్రవేశాల కొరకు దరఖాస్తు చేసుకోండి

ఎంఈఓ రాజేశ్వరి దేవివిశాలాంధ్ర ధర్మవరం : పట్టణములోని మోటుమర్ల గ్రామం వద్దగల కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయంలో (కేజీబీవీ) ఆరవ తరగతి ప్రవేశం కొరకు దరఖాస్తు చేసుకోవాలని ఎంఈఓ రాజేశ్వరి దేవి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆన్లైన్ దరఖాస్తులు మార్చి 12వ తేదీ నుండి ప్రారంభమవుతుందని, దరఖాస్తులు ఏప్రిల్ ఒకటవ తేదీ వరకు మాత్రమే స్వీకరించబడుతాయని తెలిపారు. అనంతరం ఎంపిక జాబితా ఏప్రిల్ 13న విడుదల చేస్తామని తెలిపారు. ప్రతి పాఠశాలలో ఆరవ తరగతిలో…

Read More

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

జిల్లా కలెక్టర్ కె. వెట్రి సెల్వి… విశాలాంధ్ర ఏలూరు: మహిళల సాధికారతకు ప్రభుత్వం ఎన్నో పధకాలను అమలు చేస్తున్నదని , వాటిని సద్వినియోగం చేసుకుని ప్రతీ మహిళా ఆర్ధికంగా బలోపేతం కావాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి చెప్పారు. స్థానిక సి.ఆర్. రెడ్డి కళాశాల ఆడిటోరియం లో ఆదివారం జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను కలెక్టర్ జ్యోతిని వెలిగించి ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివకిశోర్, ఎమ్మెల్యేలు బడేటి రాధాకృష్ణయ్య (చంటి), చింతమనేని ప్రభాకర్,…

Read More

అనంతపురం జిల్లాకు ఆర్డిటి సేవలు అవసరం

అనంతపురం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వై. మధుసూదన్ రెడ్డి విశాలాంధ్ర,ఉరవకొండ (అనంతపురం జిల్లా) : అత్యంత వెనకబడిన అనంతపురం జిల్లాకు ఆర్డిటి లాంటి స్వచ్ఛంద సంస్థల యొక్క సేవలు ఎంతైనా అవసరమని డిసిసి అధ్యక్షులు వై. మధుసూదనారెడ్డి తెలిపారు. ఆర్డిటి సంస్థను రక్షించాలని ఫారిన్ రెగ్యులరైజేషన్ యాక్ట్ (ఎఫ్ సి ఆర్ ఏ) పునరుద్ధరించాలని కోరుతూ సోమవారం అఖిలపక్ష పార్టీలు ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఉరవకొండలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న డిసిసి…

Read More