అక్రమ కట్టడాల కూల్చివేతను పర్యవేక్షించిన జేసీ ప్రభాకర్ రెడ్డి
విశాలాంధ్ర, యాడికి: మండల కేంద్రంలోని శ్రీ శివలక్ష్మి చెన్నకేశవ స్వామి ఆలయ భూములపై నిర్మించబడిన అక్రమ కట్టడాల తొలగింపు పనులను మంగళవారం మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి స్వయంగా పరిశీలించారు. ఆలయ పరిసరాల్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దేవస్థాన భూములను ఆక్రమించి నిర్మించిన షాపులు, వాణిజ్య సముదాయాలు వెంటనే తొలగించాలని అధికారులను ఆదేశించారు.ఆలయం తూర్పు భాగంలో ఉన్న భోగా లింగేశ్వర స్వామి ఆలయం దర్శనానికి అడ్డుగా నిర్మించిన షాపులను అధికారులు ఇప్పటికే తొలగించడం ప్రారంభించారని…


