ఉష్ణోగ్రత అలర్ట్ ఉంది. ఎందుకంటే.. ఇవాళ ఏప్రిల్ 18న గూడూరు, రాయచోటి, కడప, పులివెందుల, కదిరి, ప్రొద్దుటూరు, అనంతపురం, నంద్యాల, డోన్, కర్నూలు, గద్వాల, ఆదోని, గుంతకల్ ప్రాంతాల్లో ఎక్కువ ఎండ ఉంటుంది. ఇక్కడ ఉష్ణోగ్రత 41 డిగ్రీల సెల్సియస్ నుంచి 43 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. మిగతా ఏపీ అంతటా.. 35 నుంచి 39 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. తెలంగాణలో 37 నుంచి 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉంటాయి. ఉత్తర తెలంగాణలోని నిజామాబాద్, ఆదిలాబాద్, రామగుండం, జగిత్యాల ఈ ప్రాంతాల్లో వేడి 41 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. తేమ తెలంగాణలో 28 శాతం, ఏపీలో 46 శాతం ఉంటుంది.



