భారత్‌లో LPG సంక్షోభం తగ్గడానికి ఇంకా 4 ఏళ్లు పడొచ్చు


భారత్‌లో LPG (వంట గ్యాస్) సరఫరా సమస్యలు త్వరగా సద్దుమణిగే పరిస్థితి కనిపించడం లేదు.
ఈ సమస్య పూర్తిగా సర్దుబాటు కావడానికి ఇంకా 3 నుంచి 4 ఏళ్లు పడొచ్చని ఒక నివేదిక చెబుతోంది.
ముఖ్యంగా హార్ముజ్ జలసంధి వద్ద కొనసాగుతున్న దిగ్బంధం, అలాగే ఇరాన్ నుంచి ప్రాంతీయ ఇంధన మౌలిక సదుపాయాలపై జరుగుతున్న దాడులు పరిస్థితిని మరింత క్లిష్టం చేస్తున్నాయి.
దీంతో భారత్ సహా దక్షిణాసియా దేశాలకు వంట గ్యాస్ సరఫరా తీవ్రంగా దెబ్బతింటోంది.
కీలక సరఫరాలు నిలిచిపోవడంతో గ్యాస్ సరఫరా పునరుద్ధరణకు ఇంకా ఎక్కువ సమయం పట్టొచ్చని అధికారులు చెబుతున్నారు.గల్ఫ్ ప్రాంతంలో ఉన్న ముఖ్య ఉత్పత్తి కేంద్రాలు, ప్రాసెసింగ్ యూనిట్ల పరిస్థితిపై స్పష్టత లేకపోవడం కూడా ఆందోళన కలిగిస్తోంది.

గృహ వినియోగదారులకు ప్రాధాన్యత ఇస్తున్న ప్రభుత్వం
భారత్‌లో వినియోగిస్తున్న LPGలో దాదాపు 60 శాతం దిగుమతులపై ఆధారపడుతోంది.అందులో 90 శాతం సరఫరాలు హార్ముజ్ జలసంధి గుండా వస్తుండటంతో ఇది కీలక మార్గంగా మారింది.ఇక నిల్వ సామర్థ్యం కూడా తక్కువగానే ఉండటం పరిస్థితిని మరింత కఠినం చేస్తోంది.దేశ అవసరాలకు సరిపడే నిల్వలు కేవలం 15రోజులకే సరిపోతున్నాయి. ఈ ప్రభావం ఇప్పటికే ధరలపై కనిపిస్తోంది. గృహ వినియోగ సిలిండర్‌పై రూ.60 పెంచగా,వాణిజ్య సిలిండర్‌పై రూ.115 వరకు ధరలు పెరిగాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం గృహ వినియోగదారులకు ప్రాధాన్యత ఇస్తూ, పరిశ్రమల వినియోగాన్ని పరిమితం చేస్తోంది. అలాగే కొత్త సరఫరా మార్గాలను అన్వేషిస్తూ,ఇతర దేశాల నుంచి దిగుమతులను పెంచుతూ, దేశీయ ఉత్పత్తిని పెంచే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.

The post భారత్‌లో LPG సంక్షోభం తగ్గడానికి ఇంకా 4 ఏళ్లు పడొచ్చు appeared first on Visalaandhra.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *