ఇక పూజ అంటే కేవలం ఆచారం మాత్రమే కాదు.. మనసును ప్రశాంతంగా మార్చే ఒక ఆధ్యాత్మిక ప్రయాణం. ఈ పూజలో మనం ధరించే దుస్తులు కూడా మన భావాలు, ఆలోచనలపై ప్రభావం చూపుతాయని ప్రముఖ వేద పండితుడు సుబ్రహ్మణ్య శర్మ పేర్కొంటున్నారు. సాత్విక రంగుల దుస్తులు ధరించడం ద్వారా మనస్సు నిశ్చలంగా మారి, భక్తి భావం మరింతగా పెరుగుతుందని ఆయన వివరిస్తున్నారు. పూజలో రంగులకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉందని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా పసుపు, తెలుపు, ఎరుపు, గులాబీ రంగులు ఆధ్యాత్మికతను పెంచే శక్తి కలిగి ఉంటాయని తెలిపారు. ఈ రంగులు మనలో సానుకూలతను పెంచడమే కాకుండా, పూజ సమయంలో మనసును ఏకాగ్రంగా ఉంచేందుకు సహాయపడతాయి.



