ప్లాన్ బీ లేదు..


ఇరాన్‌తో చర్చలకు ముందు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
ప‌శ్చిమాసియాలో యుద్ధానికి ముగింపు పలికే లక్ష్యంతో అమెరికా, ఇరాన్ మధ్య ఉన్నతస్థాయి చర్చలు ఇవాళ పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌లో ప్రారంభమయ్యాయి. అయితే, ఈ చర్చలు విఫలమైతే తమ వద్ద ఎలాంటి ప్రత్యామ్నాయ ప్రణాళిక (ప్లాన్ బీ) లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ సైనిక శక్తిని తాము పూర్తిగా దెబ్బతీశామని, అందుకే ప్లాన్ బీ అవసరం లేదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ చర్చల కోసం ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బఘేర్ గాలిబాఫ్, విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరగ్చీలతో కూడిన ప్రతినిధి బృందం ఇస్లామాబాద్ చేరుకుంది. వారికి పాకిస్థాన్ మంత్రి ఇషాక్ దార్, ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ స్వాగతం పలికారు. అమెరికా తరఫున ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తున్నారు. పారిస్ నుంచి బయలుదేరే ముందు వాన్స్ ఇరాన్‌ను హెచ్చరించారు. వారు మాతో ఆడుకోవాలని ప్రయత్నిస్తే, మా చర్చల బృందం అంత సుముఖంగా ఉండదుఁ అని స్పష్టం చేశారు. గత కొన్ని వారాలుగా క్షిపణి దాడులతో అట్టుడికిన గల్ఫ్ ప్రాంతంలో ప్రస్తుతం రెండు వారాల కాల్పుల విరమణ అమలవుతోంది. ఈ ప్రశాంత వాతావరణంలోనే చర్చలు జరుగుతున్నప్పటికీ, అమెరికా తన బలగాలను ప‌శ్చిమాసియాలో మరింతగా మోహరించడం ఉద్రిక్తతలను పెంచుతోంది.చర్చలకు ముందే ఇరు దేశాలు తమ తమ డిమాండ్లతో ముందుకు వచ్చాయి. అమెరికా 15 పాయింట్ల ఫ్రేమ్‌వర్క్‌ను ప్రతిపాదించగా, ఇందులో ఇరాన్ తన వద్ద ఉన్న శుద్ధి చేసిన యురేనియంను అప్పగించాలని, సైనిక పరిమితులను అంగీకరించాలని షరతులు విధించినట్లు సమాచారం. దీనికి ప్రతిగా ఇరాన్ 10 పాయింట్ల ప్రణాళికను పంపింది. యుద్ధ నష్టపరిహారం చెల్లించాలని, హ‌ర్మూజ్ జలసంధిపై తమ సార్వభౌమత్వాన్ని అమెరికా గుర్తించాలని కోరింది. ఁఇరాన్ సైన్యం ఓడిపోయింది. వారి వద్ద కొన్ని క్షిపణులు, పరిమిత తయారీ సామర్థ్యాలు మాత్రమే ఉన్నాయి. మా సైన్యం అద్భుతంగా పని చేసింది. వారిని గట్టిగా దెబ్బతీశాం అని ట్రంప్ విలేకరులతో అన్నారు. మరోవైపు వచ్చే వారం లెబనాన్, ఇజ్రాయెల్ మధ్య కూడా చర్చలు జరగనుండటం ఈ ప్రాంతంలో దౌత్యపరమైన ప్రయత్నాలకు సూచికగా నిలుస్తోంది.

The post ప్లాన్ బీ లేదు.. appeared first on Visalaandhra.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *