భారత వాతావరణ శాఖ (IMD) స్పష్టంగా ఒక విషయం చెప్పింది. ఏప్రిల్ 6 నుంచి 10 వరకూ 5 రోజులపాటూ తెలంగాణ, కోస్తాంధ్ర, యానాం, రాయలసీమ, కర్ణాటక, పుదుచ్చేరి, కేరళలో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. అలాగే ఉరుములు, మెరుపులు, పిడుగులు కూడా పడతాయి. ఈదురుగాలుల వేగం గంటకు 30 నుంచి 50 కిలోమీటర్లుగా ఉంటుంది. అంతే కాదు.. ఏప్రిల్ 6 సోమవారం నాడు కోస్తాంధ్ర, యానాంలో అక్కడక్కడా భారీ వర్షం కురుస్తుంది అని IMD చెప్పింది. ఈ వర్షం ఘాట్ ఏరియాల్లో అంటే.. కొండలు, ఏజెన్సీలు, ఎత్తైన ప్రదేశాల్లో కురుస్తుందని తెలిపింది. కాబట్టి కోస్తా ప్రజలు ఇవాళ జాగ్రత్తలు తీసుకోవాలి.



