Last Updated:
విశాఖపట్నం వీఐపీ రోడ్లో Malabar Gold and Diamonds కొత్త మెగా షోరూమ్ ప్రారంభం. Shruti Haasan హాజరు. బంపర్ ఆఫర్లు మార్చి 31 2026 వరకు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అతిపెద్ద వాణిజ్య కేంద్రమైన విశాఖపట్నంలో పసిడి వెలుగులు మరింత జిగేల్మన్నాయి. దేశవ్యాప్తంగా నమ్మకమైన, నాణ్యమైన ఆభరణాలకు చిరునామాగా నిలిచిన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ సంస్థ, నగరంలోని అత్యంత రద్దీగా ఉండే వీఐపీ రోడ్లో తన ప్రతిష్టాత్మకమైన నూతన షోరూమ్ను సోమవారం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ ప్రముఖ సినీ నటి శృతి హాసన్ ముఖ్య అతిథిగా విచ్చేసి, షోరూమ్ను ప్రారంభించి సందడి చేశారు.
షోరూమ్ ప్రారంభోత్సవం అనంతరం శృతి హాసన్ మాట్లాడుతూ, మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్తో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. దేశంలో అత్యంత నాణ్యమైన, అద్భుతమైన డిజైన్లతో కూడిన ఆభరణాలను అందించడంలో మలబార్ సంస్థకు సాటిలేదని ఆమె ప్రశంసించారు. “విశాఖపట్నం వంటి చారిత్రాత్మక అందమైన నగరంలో ఇంత పెద్ద షోరూమ్ను ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది. ఇక్కడి ఇంటీరియర్స్, ఆభరణాల ప్రదర్శన తీరు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయి. కస్టమర్లకు ఇదొక అద్భుతమైన షాపింగ్ అనుభవాన్ని అందిస్తుంది” అని ఆమె పేర్కొన్నారు.
మలబార్ గ్రూప్ చైర్మన్ ఎం.పి. అహ్మద్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, విశాఖపట్నం తమకు అత్యంత కీలకమైన మార్కెట్ అని పేర్కొన్నారు. ఇక్కడి ప్రజలకు ఆభరణాల పట్ల ఉన్న అభిరుచి, సంప్రదాయాలను దృష్టిలో ఉంచుకుని ఈ మెగా షోరూమ్ను తీర్చిదిద్దామన్నారు. నగర అభివృద్ధికి అనుగుణంగా వినియోగదారులు కోరుకునే ఆధునిక డిజైన్లను, పారదర్శకమైన ధరలతో తాము అందిస్తున్నామని ఆయన తెలిపారు.
షోరూమ్ ప్రారంభోత్సవం సందర్భంగా కస్టమర్ల కోసం సంస్థ పలు బంపర్ ఆఫర్లను ప్రకటించింది. బంగారం, అన్కట్, రత్నాల ఆభరణాల మేకింగ్ ఛార్జీలపై (VA) 40% వరకు తగ్గింపు. వజ్రాల విలువపై ఏకంగా 30% వరకు తగ్గింపు. పాత బంగారం మార్పిడిపై 0% తగ్గింపుతో పాటు, నగదుగా మార్చుకునే వారికి అదే రోజు గరిష్ట విలువను చెల్లించే సౌకర్యం. అక్షయ తృతీయ ముందస్తు బుకింగ్తో ఉచిత వెండి నాణెం పొందే అవకాశం.
(గమనిక: ఈ ఆఫర్లు మార్చి 31, 2026 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి.)
మలబార్ గోల్డ్ ‘వన్ ఇండియా వన్ గోల్డ్ రేట్’ విధానాన్ని అనుసరిస్తూ దేశవ్యాప్తంగా ఒకే ధరకు బంగారాన్ని అందిస్తోంది. అలాగే ప్రతి ఆభరణం హెచ్యూఐడీ (HUID) అనుకూలతతో, వజ్రాలు అంతర్జాతీయ సర్టిఫికేషన్లతో లభిస్తాయి. పారదర్శకతకు పెద్దపీట వేస్తూ ప్రతి ఉత్పత్తి వెనుక పూర్తి వివరాలను వినియోగదారులకు అందిస్తామని సంస్థ ప్రతినిధులు స్పష్టం చేశారు. వీఐపీ రోడ్లోని ఈ కొత్త షోరూమ్ ఇప్పుడు విశాఖ వాసులకు పసిడి కొనుగోళ్లలో ఒక సరికొత్త గమ్యస్థానంగా మారింది.
ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana



